Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత... 22 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (08:57 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. ఓ దండగుడు జరిపిన కాల్పుల్లో ఏకంగా 22 మంది చనిపోయారు. ఈ దారుణం మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి జరిగింది. ఓ బౌలింగ్ యాలీ, మరో బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
సెమీ ఆటోమేటిక్ తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. స్థానిక మీడియా కథనాల మేరకు.. ఈ ఘటనలో 22 మంది చనిపోగా, మరో 60 మంది గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడి ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాల్పులు జరిపిన ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు, దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. మరోవైపు, ఈ దారుణ ఘటనపై మెయిన్ చట్టసభ సభ్యుడు జేరెడ్ గోల్డెన్ ట్విట్టర్ వేదికగా తన విచారం వ్యక్తం చేస్తూ, తాను తీవ్రమైన భయభ్రాంతులకు గురైనట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments