Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత... 22 మంది మృత్యువాత

Webdunia
గురువారం, 26 అక్టోబరు 2023 (08:57 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. ఓ దండగుడు జరిపిన కాల్పుల్లో ఏకంగా 22 మంది చనిపోయారు. ఈ దారుణం మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి జరిగింది. ఓ బౌలింగ్ యాలీ, మరో బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 
 
సెమీ ఆటోమేటిక్ తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. స్థానిక మీడియా కథనాల మేరకు.. ఈ ఘటనలో 22 మంది చనిపోగా, మరో 60 మంది గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతడి ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాల్పులు జరిపిన ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు, దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. మరోవైపు, ఈ దారుణ ఘటనపై మెయిన్ చట్టసభ సభ్యుడు జేరెడ్ గోల్డెన్ ట్విట్టర్ వేదికగా తన విచారం వ్యక్తం చేస్తూ, తాను తీవ్రమైన భయభ్రాంతులకు గురైనట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments