Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ.. 700మంది మృతి.. 30వేల మందికి కరోనా

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (17:01 IST)
అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ మొండి వైఖరి కారణంగా అమెరికాలో 30వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. 700 మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ను మొదటి నుంచి తేలిగ్గా తీసుకున్న ట్రంప్.. వైద్య నిపుణుల సూచనలను కూడా లెక్క చేయకుండా ఎన్నికల నేపథ్యంలో భారీ ప్రచార ర్యాలీలను నిర్వహించారు.
 
కాగా.. ట్రంప్ నిర్వహించిన 18 ఎన్నికల ర్యాలీల కారణంగా సుమారు 30వేల మందిపైగా ప్రజలు కరోనా బారినపడ్డారని.. ఇందులో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయారని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అంచనా వేశారు.
 
'ది ఎఫెక్ట్స్ ఆఫ్ లార్జ్ గ్రూప్ మీటింగ్ ఆన్ ది స్ప్రెడ్ ఆఫ్ కొవిడ్-19: ది కేస్ ఆఫ్ ట్రంప్ ర్యాలీస్' అంశంపై స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీ పరిశోధనలు జరిపి దానికి సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది. జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 మధ్య డొనాల్డ్ ట్రంప్ 18 ఎన్నికల ర్యాలీలను నిర్వహించినట్లు నివేదికలో తెలిపింది. ఈ ర్యాలీల కారణంగా 30వేల మంది కరోనా బారినపడ్డట్టు.. 700 మంది కరోనా కాటుకు బలైనట్టు పేర్కొంది. 
 
అంతేకాకుండా భారీ జనసమూహాల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందన్న వైద్య నిపుణుల వాదనను తాము సమర్థిస్తున్నట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ నివేదికపై డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ స్పందించారు. 'ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మిమ్మల్ని పట్టించుకోరు. సొంత మద్దతుదారుల గురించి కూడా ఆయన ఆలోచించరు' అంటూ విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments