Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్జింగ్‌లో స్మార్ట్‌ఫోన్.. పాటలు వింటూ నిద్రించిన బాలిక.. చివరికి ఏమైందంటే?

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (19:18 IST)
స్మార్ట్ ఫోన్లు లేకుండా ఒక సెకను కూడా వుండలేని వారు ఎందరో వున్నారు. స్మార్ట్ ఫోన్లను వాడే వారి సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఓ 14 ఏళ్ల బాలిక సెల్ ఫోన్‌లో పాటలు వింటూ నిద్రించింది. చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ ఘటన కజగస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సెల్ ఫోన్‌లో పాటలు వింటూ నిద్రించిన మహిళ.. ఆ సెల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో ప్రాణాలు కోల్పోయింది. కజగస్థాన్‌కు చెందిన బాస్పేట్ అనే గ్రామానికి చెందిన ఆల్వా అప్జల్ బెక్ (14) అనే బాలిక.. ఆదివారం రాత్రి సెల్ ఫోనులో పాటలు వింటూ నిద్రించింది. 
 
తెల్లవారైనా చాలాసేపటికి యువతి నిద్ర నుంచి మేల్కోకపోవడంతో అనుమానంతో తల్లిదండ్రులు ఆ యువతిని నిద్రలేపారు. ఆపై ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ యువతిని పరిశోధించిన వైద్యులు అప్పటికే యువతి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో.. 14 ఏళ్ల బాలిక రాత్రి నిద్రించే ముందు సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టింది. 
 
తలకు పక్కనే ఆ ఫోనును వుంచి.. హెడ్ ఫోన్ ద్వారా పాటలు వింటూ నిద్రించింది. సెల్ ఫోన్‌ చాలాసేపటికీ ఛార్జింగ్‌లో వుండటం ద్వారా బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో బాలిక తలకు గాయమై ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments