Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్జింగ్‌లో స్మార్ట్‌ఫోన్.. పాటలు వింటూ నిద్రించిన బాలిక.. చివరికి ఏమైందంటే?

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (19:18 IST)
స్మార్ట్ ఫోన్లు లేకుండా ఒక సెకను కూడా వుండలేని వారు ఎందరో వున్నారు. స్మార్ట్ ఫోన్లను వాడే వారి సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఓ 14 ఏళ్ల బాలిక సెల్ ఫోన్‌లో పాటలు వింటూ నిద్రించింది. చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ ఘటన కజగస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సెల్ ఫోన్‌లో పాటలు వింటూ నిద్రించిన మహిళ.. ఆ సెల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో ప్రాణాలు కోల్పోయింది. కజగస్థాన్‌కు చెందిన బాస్పేట్ అనే గ్రామానికి చెందిన ఆల్వా అప్జల్ బెక్ (14) అనే బాలిక.. ఆదివారం రాత్రి సెల్ ఫోనులో పాటలు వింటూ నిద్రించింది. 
 
తెల్లవారైనా చాలాసేపటికి యువతి నిద్ర నుంచి మేల్కోకపోవడంతో అనుమానంతో తల్లిదండ్రులు ఆ యువతిని నిద్రలేపారు. ఆపై ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ యువతిని పరిశోధించిన వైద్యులు అప్పటికే యువతి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో.. 14 ఏళ్ల బాలిక రాత్రి నిద్రించే ముందు సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టింది. 
 
తలకు పక్కనే ఆ ఫోనును వుంచి.. హెడ్ ఫోన్ ద్వారా పాటలు వింటూ నిద్రించింది. సెల్ ఫోన్‌ చాలాసేపటికీ ఛార్జింగ్‌లో వుండటం ద్వారా బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో బాలిక తలకు గాయమై ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments