Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్జింగ్‌లో స్మార్ట్‌ఫోన్.. పాటలు వింటూ నిద్రించిన బాలిక.. చివరికి ఏమైందంటే?

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (19:18 IST)
స్మార్ట్ ఫోన్లు లేకుండా ఒక సెకను కూడా వుండలేని వారు ఎందరో వున్నారు. స్మార్ట్ ఫోన్లను వాడే వారి సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఓ 14 ఏళ్ల బాలిక సెల్ ఫోన్‌లో పాటలు వింటూ నిద్రించింది. చివరికి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ ఘటన కజగస్థాన్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సెల్ ఫోన్‌లో పాటలు వింటూ నిద్రించిన మహిళ.. ఆ సెల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో ప్రాణాలు కోల్పోయింది. కజగస్థాన్‌కు చెందిన బాస్పేట్ అనే గ్రామానికి చెందిన ఆల్వా అప్జల్ బెక్ (14) అనే బాలిక.. ఆదివారం రాత్రి సెల్ ఫోనులో పాటలు వింటూ నిద్రించింది. 
 
తెల్లవారైనా చాలాసేపటికి యువతి నిద్ర నుంచి మేల్కోకపోవడంతో అనుమానంతో తల్లిదండ్రులు ఆ యువతిని నిద్రలేపారు. ఆపై ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ యువతిని పరిశోధించిన వైద్యులు అప్పటికే యువతి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో.. 14 ఏళ్ల బాలిక రాత్రి నిద్రించే ముందు సెల్‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టింది. 
 
తలకు పక్కనే ఆ ఫోనును వుంచి.. హెడ్ ఫోన్ ద్వారా పాటలు వింటూ నిద్రించింది. సెల్ ఫోన్‌ చాలాసేపటికీ ఛార్జింగ్‌లో వుండటం ద్వారా బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో బాలిక తలకు గాయమై ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments