శీతాకాలంలో నిస్సత్తువ, నీరసం: నెయ్యిని తీసుకుంటే...

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (23:35 IST)
శీతాకాలంలో చాలామంది శక్తిని కోల్పోయి నీరసంగా, అలసటగా కనిపిస్తుంటారు. అలాంటివారికి నెయ్యి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. రోజుకు ఒక్కసారి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కలిపి సేవిస్తే పై తెలిపిన సమస్యలుండవు. కొంతమందికి ఏ ఆహార పదార్థాలు తీసుకున్నా జీర్ణవ్యవస్థ అంతగా ఉంటుంది. ఈ సమస్య వలన కడుపునొప్పి, వాంతులు, కళ్లు తిరగడం వంటి వాటికి గురౌతారు. వీటి నుంచి బయటపడాలంటే నెయ్యిని తరచుగా తీసుకోవాలి. దాంతో జీర్ణవ్యవస్థ మెరుగపడుతుంది. 

 
రోజూ మీరు తయారుచేసుకునే ఆహార పదార్థాల్లో లేదా కూరల్లో కొద్దిగా నెయ్యి వేసి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషక విలువలు పుష్కలంగా అందుతాయి. దాంతో రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చలికాలంలో చర్మం రక్షణకోసం ఏవేవో మందులు, క్రీములు వాడుతుంటారు. వాటిని వాడడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి సౌందర్య సాధనకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు.  అందుకు నెయ్యి ఎంతగానో పనిచేస్తుంది. 

 
ఒక బౌల్‌లో 5 స్పూన్ల్ నెయ్యిని వేడిచేసుకుని అది బాగా చల్లారిన తరువాత అందులో కొద్దిగా పెరుగు, నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా తరచుగా చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది. అల్సర్ వ్యాధితో బాధపడేవారు నెయ్యిని వేడి చేసి అందులో కొద్దిగా చక్కెర లేదా పెరుగు కలిపి సేవిస్తే సమస్య పోతుంది. నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకొచ్చేస్తాయి.

 
దగ్గు, జలుబు, ముక్కుదిబ్బ వంటి వ్యాధుల నుండి విముక్తి లభించాలంటే.. ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాస్ గోరువెచ్చని పాలలో 3 స్పూన్ల నెయ్య కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అస్సాంలో బహు భార్యత్వంపై నిషేధం... అతిక్రమిస్తే పదేళ్ల జైలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments