Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఆకులలో ఏముందో తెలిస్తే తినేస్తారు

Webdunia
గురువారం, 29 జులై 2021 (23:29 IST)
1. నేల మునగ ఆకులు - ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును. ఇది మన శరీరమునకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
 
2. తులసీ ఆకులు- తులసి ఆకులను శుభ్రపరచుకొని రోజూ ఐదారు ఆకుల చొప్పున తినినచో దగ్గు, వాంతులు, జలుబు తగ్గుతాయి.
 
3. రావి ఆకులు- రావి ఆకులను మెత్తగా నూరి పొడి చేసి తేనెతో సేవిస్తే శ్వాసకోశవ్యాధులు నయం అవుతాయి.
 
4. దానిమ్మ ఆకు- దానిమ్మ ఆకులను పొడిచేసి కషాయం కాచి త్రాగటం వలన అజీర్తి, ఉబ్బసం తగ్గుతాయి. గ్యాస్ ట్రబుల్ కంట్రోల్‌లో ఉంటుంది.
 
5. మారేడు ఆకులు- మారేడు ఆకుల్ని నమిలి రసాన్ని  నిదానంగా మింగాలి. కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకొని త్రాగాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మూలశంక నయమగును.
 
6. తోటకూర- వారంలో కనీసం రెండు సార్లయినా తోటకూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
 
 7. కొత్తిమీర- కొత్తిమీరలో విటమిన్ ఎ, బి, భాస్వరం చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణశక్తిని పెంచటమే కాకుండా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. డయోరియాతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 
8. పుదీనా - ఇది శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. వాంతులు, తలనొప్పి సమస్యలకు పుదీనా రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కడుపునొప్పి, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.
 
9. పాలకూర- పాలకూరలో ఎక్కువగా విటమిన్ సి, కాల్షియం, ఇనుము సమృద్దిగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ ఎక్కువుగా ఉండటం వలన ఇది క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ కె ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.
 
10. గోంగూర- దీనిలో పొటాషియం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటంవలన రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉండటం వలన ఇది కంటిచూపు బాగా ఉండటానికి దోహదపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments