పనస పండును ఎవరు తినకూడదు?

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (22:18 IST)
పనసకాయలు వచ్చే కాలం ఇది. పనస తొనలను ఎంతో ఇష్టంగా తింటుంటారు చాలామంది. ఐతే ఈ పనస కాయలను కొంతమంది తింటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంటుంది. ముఖ్యంగా అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపునొప్పి, అగ్నిమాంధ్యం, క్షయ, శుక్ర నష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనసపండును తినకూడదు.
 
సహజంగా చెట్టుకు పండిన కాయను అలా తినేయకుండా ఇంట్లో ఒకటిరెండ్రు రోజులు నిలువపెట్టుకుని తింటే రుచిగా వుంటుంది. ఐతే ఈ పనస కాయల తొనలను అధికంగా తింటే అతిసారం కలుగుతుంది. పనస పాలను, ద్రాక్ష రెండూ కలిపి సారాలో నూరి పట్టు వేస్తే, దెబ్బ, వాపులు తగ్గుతాయి. పండిన పనస ఆకులను, వేరును చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంటారు. మరికొన్ని ఉపయోగాలు చూద్దాం.
 
1. పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి. 
 
2. పనస తొనలు తినడం ద్వారా మగవారిలోవీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీర్యవృద్ధిని కలిగించి, శృంగారంలో అధిక ఆనందం కలిగించేలా చేస్తుంది.
 
3. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది.రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మం మరియు జుట్టుల ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది.
 
4. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనిలో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.
 
5. ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పిమరియు గుండెపోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది.
 
6. పనస పండు షుగరు వ్యాది ఉన్నవారికి మంచి ఆాహారం. దీనిని తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ లెవల్ పెరిగేలా చేస్తుంది.
 
7. పనసపండులోని క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే పైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాసు మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంటే కమిటీతో కాలయాపనా?: డిప్యూటీ సీఎం పవన్‌కు రోజా ప్రశ్న

ప్రియుడి కోసం తల్లిదండ్రులకు విషం ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది

భార్యను చంపేసిన భారత సంతతికి చెందిన వ్యక్తి.. ఎందుకు చంపాడు.. ఏంటి సమాచారం?

పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్ చేయండి, కేంద్ర రైల్వే మంత్రికి డిప్యూటీ సీఎం పవన్ విన్నపం

నాగర్‌కర్నూల్ జిల్లాలో 100 వీధి కుక్కలను చంపేశారు.. సర్పంచ్‌కు సంబంధం వుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్‌ తాగుతూ రఫ్‌ గా వుండే పాత్రలో శృతి హాసన్‌

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

మొదటి సారిగా మనిషి మీద నమ్మకంతో శబార మూవీని చేశా : దీక్షిత్ శెట్టి

Yadu Vamsi: తెలుగమ్మాయి కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సన్నాహాలు

Hreem: షూటింగ్‌ పూర్తి చేసుకున్న హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం హ్రీం

తర్వాతి కథనం
Show comments