మినుములను నూనెలో వేయించి..?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (18:12 IST)
మినుములు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మినపప్పు తరచు ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన శరీర వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు అనేకరకాల వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చును. 100 గ్రాముల మినుముల్లో 18 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ఇవన్నీ అధిక బరువును తగ్గించడానికి చాలా ఉపయోగపడుతాయి. 
 
పావుకప్పు మినుములను నూనెలో వేయించుకోవాలి. ఆపై 5 ఎండుమిర్చి, 3 టమోటాలు, 1 ఉల్లిపాయను కూడా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఎండుమిర్చి కచ్చాపచ్చాగా చేసి అందులో కొద్దిగా ఉప్పు, వేయించిన మినుములు వేసి రుబ్బుకోవాలి. తరువాత కొద్దిగా చింతపండు, ఉల్లిపాయ, టమోటాలు వేసి పచ్చడిగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని తాలింపు పెట్టుకోవాలి. చివరగా ఈ పచ్చడిలో నెయ్యివేసి వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచుగా ఉంటుంది. ఇలా మినుముతో చేసిన పదార్థాలు తింటుంటే జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
 
అంతేకాక గుండె జబ్బులను నివారించే అద్భుతమైన గుణం మినుములకు ఉంది. ఇందుకు కారణం మినుముల్లో ఉన్న పొటాషియం, పీచుపదార్థాలే. అవి రక్తంలోకి వెలువడే చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తాయి. అలానే మినుములతో తయారుచేసిన గారెలు, వడలు వంటివి తింటుంటే కూడా డయాబెటిస్ వ్యాధి అదుపులో ఉంటుంది. ముఖ్యంగా రక్తపోటు వ్యాధిని తగ్గిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments