Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్నింగ్ వాక్‌తో ఎన్ని ప్రయోజనాలో?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:31 IST)
ఆధునిక ప్రపంచం సరికొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని సౌకర్యాలు డోర్ డెలివరీలు చేయించుకునే సౌలభ్యం వచ్చింది. ఈ గజి 'బిజీ' జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వాళ్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. తినడానికి కూడా సమయం దొరకనంత బిజీగా ఉద్యోగాల్లో నిమగ్నమై ఉంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరం అలసటకు గురవుతుంది. ఇలాంటి పరిస్థితిని దరిచేరనీయకుండా ఉండేందుకు రోజుకి కనీసం 20 నిమిషాల పాటు నడిస్తే శరీరానికి చాలా మంచిదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
 
నడకతో అన్ని రకాల రోగాలు దూరం అవుతాయి. రక్తపోటు, మధుమేహం, మానసిక ఒత్తిడి, క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులు రావు. ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లభిస్తుంది. ఉదయాన్నే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మనిషిపై పడటం వల్ల విటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది. శరీరభాగంలో ఉన్న అధిక కొవ్వును కరిగించి, బరువు తగ్గించేందుకు నడక దోహదపడుతోంది. క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిరంతరం వాకింగ్ చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
వాకింగ్ చేయడాన్ని చిన్నతనం నుండే అలవాటుగా మార్చుకోవడం మంచిదని సూచించారు. ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటారని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉద్యోగ రీత్యా కలిగే మానసిక ఒత్తడిని కూడా వాకింగ్ నియంత్రిస్తుందని మానసిక వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments