Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరానికి పట్టిన నీరు తొలగించాలంటే.. పిప్ళిళ్ళను నేతిలో వేయించి..?

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (10:06 IST)
వంటికి నీరు పట్టడానికి అనేక కారాణాలున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో నీరు పట్టడం అనారోగ్యం. వీటికి ఎవరిమటుకు వారే చికిత్సలు చేసుకోవచ్చును. మరి ఆ చికిత్సలేంటో ఓసారి తెలుసుకుందాం..
 
1. అల్లాన్ని మెత్తగా దంచి చిక్కగా రసాన్ని తీసి, దానిలో కొంచెం పాత బెల్లాన్ని కలుపుకుని రోజూ రెండుపూటలా నాలుగు చెంచాలు తీసుకుంటుంటే వంటికి పట్టిన నీరు తగ్గుతుంది.
 
2. పిప్ళిళ్ళను నేతిలో వేయించి, మెత్తగా దంచాలి. శొంఠిని కూడా నిప్పులమీద కాల్చి, మెత్తగా దంచి, రెంటిని సమానంగా కలిపి, బెల్లంతో నూరి తింటుంటే శరీరానికి నీరు లాగేస్తుంది. కీళ్ళ నొప్పులు, నడుంనొప్పి తగ్గిపోతుంది.
 
3. గలిజేరు తీగ పాలంగట్లు మీద పెరుగుతుంది. దీనిని తెచ్చి బాగా ఎండించి, మెత్తగా దంచి, పాలలోగానీ, మజ్జిగలో గానీ కలుపుకుని త్రాగుతుంటే వంటికి పట్టిన నీరులాగేస్తుంది.
 
4. నేలవేమును బాగా పొడిచేసి, దీనికి సమానంగా శొంఠిని తీసుకుని బెల్లంతో నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసుకుని రెండుపూటలా వేసుకుంటుంటే వంటికి పట్టిన నీరు తగ్గుతుంది.
 
5. పునర్ణవారిష్ట, రోహితకారిష్ట, శాశీసభస్మ మండూరభస్మ, లోహభస్మ, గోక్షురాది చూర్ణం, చంద్ర ప్రభావటి, స్వర్ణవంగం, త్రివంగభస్మ వంటి చాలా మందులు ఆయుర్వేదం మందుల షాపులో దొరుకుతాయి. వీటిని వాడుతున్నా వంటికి పట్టిన నీరు లాగేస్తుంది.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments