గోంగూర పూలను దంచి... అరకప్పు రసం చేసి.. అలా తీసుకుంటే...

ప్రకృతిలో ప్రతి ఆకు ఒక మూలిక. సృష్టిలోని ప్రతి మొక్క ఎంతోకొంత ఔషధ గుణం కలిగి ఉంటుంది. కాకపోతే మన శాస్త్రజ్ఞులు ఇప్పటికి కొన్ని గుణాలను మాత్రమే తెలుసుకోగలిగారు.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (14:03 IST)
ప్రకృతిలో ప్రతి ఆకు ఒక మూలిక. సృష్టిలోని ప్రతి మొక్క ఎంతోకొంత ఔషధ గుణం కలిగి  ఉంటుంది. కాకపోతే మన శాస్త్రజ్ఞులు ఇప్పటికి కొన్ని గుణాలను మాత్రమే తెలుసుకోగలిగారు. గోంగూర అంటే ఇష్టపడనివారుండరు. దీనికి ఆంధ్రామాత అని పేరు కూడా ఉంది. గోగుపూలు అందంగా ఉంటాయి.  అస్తమించే సూర్యుడు గోగుపూల ఛాయలో ఉంటాడని కవులు వర్ణించారు కూడా.
 
గోంగూరకు ఔషధ గుణాలున్నా యని పరిశోధకులు ఎప్పుడో తెలుసుకున్నారు. వ్రణాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంలో ముంచి, వెచ్చచేసి వేస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. అంతేకాకుండా వ్రణాలు, గడ్డల వల్ల కలిగే తీపు తగ్గి, అవి తొందరగా పగులుతాయి. స్వస్థత చిక్కుతుంది. దీనివలన కలిగే ఆరోగ్యప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
 
1. రేచీకటికి రాత్రిపూట సరిగా చూపు కనపడక పోవటం అనే నేత్ర రోగం లేదా దృష్టిదోషంతో బాధపడేవారు భోజనంలో ఆకుకూరగానో, పచ్చడిగానో, ఊరగాయగానో గోంగూర వాడితే కొంతమేరకు మంచి ఫలితం ఉంటుంది. గోంగూర పూలను దంచి, అరకప్పు రసం చేసి, దాన్ని వడకట్టి, దానిలో ఒక అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 
 
2. తరచూ గోంగూర వాడుతూ గోంగూర పువ్వులను దంచి అర కప్పు రసం తీసి దానికి అరకప్పు పాలు కలిపి తాగితే రేచీకటి తగ్గుతుంది.
 
3. బోదకాలు తగ్గడానికి శరీరంలో వాపులు తీయడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి ఆ పదార్థాన్ని పట్టించాలి.
 
4. విరోచనాలు అధికంగా అవుతుంటే కొండగోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి త్రాగితే అవి కట్టుకుంటాయి. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూర అన్నంతో తిన్నా విరోచనాలు తగ్గిపోతాయి.
 
5. దగ్గు, ఆయాసం తుమ్ములతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఏదోవిధంగా... అంటే ఆహారంగానో లేక ఔషధంగానో పుచ్చుకుంటే స్వస్థత చిక్కుతుంది.
 
6. శరీరంలో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాల మంచిది. అంతేకాకుండా గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది. ఉష్ణతత్వ శరీరులకు, నిక్కాకతో బాధపడేవారికి గోంగూర పడదు. వారు ఏ రూపాన కూడా గోంగూర తినరాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

తర్వాతి కథనం
Show comments