Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మారేడు ఆకులు మెల్లిగా నమిలి మింగుతుంటే అది తగ్గుతుంది...

మనం ప్రతిరోజు రకరకాల ఆహారపదార్థాలను తీసుకుంటూ ఉంటాం. మనం తినే కాయగూరలు, పండ్లతో పాటు ఆకుకూరలు కూడా మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆకు కూరలవల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.

మారేడు ఆకులు మెల్లిగా నమిలి మింగుతుంటే అది తగ్గుతుంది...
, మంగళవారం, 28 ఆగస్టు 2018 (18:55 IST)
మనం ప్రతిరోజు రకరకాల ఆహారపదార్థాలను తీసుకుంటూ ఉంటాం. మనం తినే కాయగూరలు, పండ్లతో పాటు ఆకుకూరలు కూడా మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆకు కూరలవల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.
 
1. నేల మునగ ఆకులు - ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును. ఇది మన శరీరమునకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
2. తులసీ ఆకులు- తులసి ఆకులను శుభ్రపరచుకొని రోజూ ఐదారు ఆకుల చొప్పున తినినచో దగ్గు, వాంతులు, జలుబు తగ్గుతాయి.
3. రావి ఆకులు- రావి ఆకులను మెత్తగా నూరి పొడి చేసి తేనెతో సేవిస్తే శ్వాసకోశవ్యాధులు నయం అవుతాయి. 
4. దానిమ్మ ఆకు- దానిమ్మ ఆకులను పొడిచేసి కషాయం కాచి త్రాగటం వలన అజీర్తి, ఉబ్బసం తగ్గుతాయి. గ్యాస్ ట్రబుల్ కంట్రోల్‌లో ఉంటుంది.
5. మారేడు ఆకులు- మారేడు ఆకుల్ని నమిలి రసాన్ని  నిదానంగా మింగాలి. కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో వేసుకొని త్రాగాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మూలశంక నయమగును.
6. తోటకూర- వారంలో కనీసం రెండు సార్లయినా తోటకూరను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
 7. కొత్తిమీర- కొత్తిమీరలో విటమిన్ ఎ, బి, భాస్వరం చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణశక్తిని పెంచటమే కాకుండా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. డయోరియాతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
8. పుదీనా - ఇది శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. వాంతులు, తలనొప్పి సమస్యలకు పుదీనా రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. కడుపునొప్పి, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. 
9. పాలకూర- పాలకూరలో ఎక్కువగా విటమిన్ సి, కాల్షియం, ఇనుము సమృద్దిగా ఉంటుంది.ఇందులో విటమిన్ ఇ ఎక్కువుగా ఉండటం వలన ఇది క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ కె ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.
10. గోంగూర- దీనిలో పొటాషియం, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటంవలన రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉండటం వలన ఇది కంటిచూపు బాగా ఉండటానికి దోహదపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొప్పాయి గుజ్జులో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుంటే?