శొంఠిని పేస్టులా చేసుకుని రాస్తే అవన్నీ తగ్గిపోతాయ్...

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (19:31 IST)
అనారోగ్య సమస్య వచ్చినప్పుడల్లా రకరకాల మందులను వాడుతుంటారు. వీటిని దీర్ఘకాలంగా వాడటం వలన చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కనుక ఏ రోగానికైనా దీర్ఘకాలంగా మందులు వాడటం మంచిది కాదు. మన ఇంట్లో సహజంగా లభించే పదార్ధాలతోనే అజీర్తి లాంటి అనేక అనారోగ్యసమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో పిల్లలకు తరచూ జలుబు, దగ్గు లాంటివి వస్తూ ఉంటాయి. వీటికి మన ఇంట్లో లభించే శొంఠి చక్కటి ఔషధంలా పని చేస్తుంది. అది ఎలాగో చూద్దాం.
 
1. శొంఠి పౌడర్‌ను పేస్ట్‌లా చేసి నుదిటికి రాస్తే తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. చాలా వరకూ తలనొప్పికి ఉపయోగించే థెరఫీలలో దీన్ని ఉపయోగిస్తుంటారు. గొంతుకు రాయడం వల్ల గొంతు నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. 
 
2. శొంఠి పౌడర్‌ను చెరుకు రసానికి మిక్స్ చేసి తాగడం వల్ల పొట్టలో చికాకును తొలగిస్తుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఈ డ్రింక్ తాగడం వల్ల పొట్ట సమస్యలు తగ్గిపోతాయి.
 
3. శొంఠి పౌడర్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. రెండుమూడు టేబుల్ స్పూన్ల పౌడర్లో నీళ్ళు మిక్స్ చేసి వేడి చేసి, తాగడం వల్ల జాయింట్ వాపులను తగ్గిస్తుంది. మోకాళ్ళకు ఈ పేస్ట్‌ను లేదా శొంఠి కలిపిన వాటర్‌ను అప్లై చేస్తే నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. 
 
4. శొంఠి పౌడర్ సాధారణంగా లేదా సీజనల్‌గా వచ్చే జలుబును నివారించడంలో బాగా సహాయపడుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు శొంఠి పౌడర్‌కు కొద్దిగా పెప్పర్ పౌడర్, చిటికెడు బెల్లం మిక్స్ చేసి కషాయం చేసి తాగడం వల్ల జలుబు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. శొంఠి పౌడర్‌కు లవంగాల పొడి, ఉప్పు మిక్స్ చేసి రోజుకు రెండుసార్లు తీసుకుంటే జలుబు, దగ్గు నివారించబడతాయి.
 
5. శొంఠిలో థర్మోజనిక్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి ఫ్యాట్‌ను కరిగించి ఒబేసిటి తగ్గించగలుగుతాయి. కనకు శొంఠిని తీసుకుంటే శరీరంలో నిల్వ చేరిన ఫ్యాట్ కరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

AP Liquor Scam: రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఆ ముగ్గురికి?

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130మంది మావోయిస్టులు

అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కల్తీ.. రసాయనాలు కలిపిన నలుగురు అరెస్ట్

మీరిచ్చే బోడి 25వేల కోసం మూడో బిడ్డను కనాలా?: సీఎం చంద్రబాబుకి షర్మిల ప్రశ్నలు

ఉచిత బస్సులో పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్-త్రిష: ఔను... వాళ్లిద్దరూ కలిసే వచ్చారు, వీడియో వైరల్

Bobby and Krish :: హృతిక్ రోషన్ తో దర్శకుడు బాబీ - కొత్తవారితో క్రిష్ చిత్రం ?

Sanjay Dutt: స్కేల్.. టెన్షన్.. డెడ్లీ యాక్షన్ గా ధురంధర్: ది రివెంజ్ ట్రైలర్ రిలీజ్

Varalakshmi : సరస్వతి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది: వరలక్ష్మి శరత్ కుమార్

Keeravani: విక్రమ్ ఆన్ డ్యూటీ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది : ఎంఎం కీరవాణి

తర్వాతి కథనం
Show comments