Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచినీళ్లను ఇలా తాగితే ఎన్ని రోగాలు పోతాయో తెలుసా? (video)

Webdunia
బుధవారం, 28 జులై 2021 (18:50 IST)
రాగి పాత్రలో రాత్రిపూట నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం వలన శరీరంలోని కఫ, వాత, పిత్త దోషాలను బ్యాలెన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. శరీరంలోని వివిధ అవయవాల పనితీరు మెరుగుపడేందుకు కూడా ఇది సహకరిస్తుంది. 
 
రాగి పాత్రలోని నీటిని తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. అల్సర్లు తగ్గడానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవడానికి ఇది సహకరిస్తుంది. కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. ఆహారంగా తీసుకున్న పోషకాలు శరీరానికి అందుతాయి. 
 
వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ప్రయోజనకరం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి, జీర్ణక్రియ పనితీరు మెరగుపడటానికి రాగి పాత్రలోని నిల్వ ఉంచిన నీటిని తాగడం ఉపకరిస్తుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల తనకు అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకొని మిగతా వాటిని శరీరం బయటకు పంపుతుంది.
 
గాయాలు త్వరగా మానడానికి కూడా ఇది ఉపకరిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త కణాల ఉత్పత్తికి రాగి దోహదం చేస్తుంది. శరీరంలో లోపల, ముఖ్యంగా కడుపులో ఏర్పడిన పుండ్లను మాన్పడానికి రాగి సహకరిస్తుంది.  వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి రాగి్ పాత్రలో నిల్వ ఉంచిన నీరు సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయలను దరిచేరకుండా చేస్తుంది.
 
క్యాన్సర్ వచ్చే ముప్పును కూడా ఇది తగ్గిస్తుంది. ఇందులోని యాంటి ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలతో పోరాడుతాయి. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండటంతోపాటు, థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగపడుతుంది. 
 
ఆర్థరైటిస్ రాకుండా, కీళ్ల నొప్పుల బారిన పడకుండానూ ఇది కాపాడుతుంది. చర్మ వ్యాధుల బారిన పడకుండా, రక్తహీనత తగ్గడానికి ఈ అలవాటు ఉపకరిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments