Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేరేడు పళ్లు వచ్చేసాయి, వాటిని తింటే ఏమవుతుందో తెలుసా?

Advertiesment
Neredu fruit
వర్షాకాలం రాగానే కొన్ని సీజనల్ పండ్లు మార్కెట్లో దర్శనమిస్తాయి. వేసవిలో వచ్చిన మామిడిపళ్లు మెల్లగా మాయమవ్వగా ఇప్పుడు నేరేడు పండ్లు వచ్చేసాయి. ఈ నేరేడు ఆకులు లేదా గింజల్ని ఎండబెట్టి పొడి చేసి రోజూ ఓ టీ స్పూన్ మేర తేనెతో కలిపి తీసుకుంటే మధుమేహంతో ఇబ్బందిపడే వారికే కాదు.. అందరికీ మేలు జరుగుతుంది. 
 
పొడిని నీళ్లలో వేసి మరిగించి కషాయం రూపంలో సేవిస్తే మధుమేహులకి మరీ మంచిది. ముఖ్యంగా గింజల్లోని గ్లైకోసైడ్‌ పిండిపదార్థాల్ని చక్కెరలుగా మారకుండా అడ్డుకుంటుంది. పైగా క్లోమగ్రంథుల నుంచి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచే గుణాలూ ఈ గింజల్లో ఉన్నాయి. ఈ పొడి అతి దాహాన్నీ తగ్గిస్తుంది.
 
కాబట్టి నేరేడు పండ్లు తిని గింజల్ని పారేయకండి. ఎండబెట్టి పొడి చేసి వాడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు 
 
ఇక నేరేడు పండు మంచి మౌత్‌ ఫ్రెష్‌నర్‌‌గా పనిచేస్తుంది. చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. ఇందులో వుండే ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడటం ద్వారా కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నం వండిన తర్వాత గంజిని పడేస్తున్నారా?