Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ బ్రౌన్ రైస్ తీసుకుంటే?

ప్రస్తుత తరుణంలో పాలిష్ చేసిన బియ్యాన్నే ఎక్కువగా తీసుకుంటున్నాము. కానీ అది మంచిది కాదు. పూర్వికులు దంపుడు బియ్యాన్నే తినేవారు. ఈ బియ్యాన్ని తీసుకోవడం వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. పాలిష్

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (10:19 IST)
ప్రస్తుత తరుణంలో పాలిష్ చేసిన బియ్యాన్నే ఎక్కువగా తీసుకుంటున్నాము. కానీ అది మంచిది కాదు. పూర్వికులు దంపుడు బియ్యాన్నే తినేవారు. ఈ బియ్యాన్ని తీసుకోవడం వలన వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. పాలిష్ చేసిన బియ్యాన్ని తీసుకోవడం వలన అనారోగ్యాలకు గురియగుతున్నారు. అందువలన వాటికి బదులుగా బ్రౌన్ రైస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
ముడి బియ్యం తీసుకోవడం వలన అనేక పోషకాలు అందడంతోపాటు పలు అనారోగ్య సమస్యలు నుండి విముక్తి చెందవచ్చును. మరి ఈ బియ్యంలో గల లాభాలను తెలుసుకుందాం. డయోబెటిస్ ఉన్నవారికి ఈ బియ్యం చాలా సహాయపడుతాయి. ఈ ముడిబియ్యంలో ఉండే ఫైటిక్ యాసిడ్, ఫైబర్, పాలిఫినాల్స్, సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్స్ రక్తంలోకి గ్లూకోజ్ విడుదలయ్యే ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. తద్వారా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.  
 
ఎముకలను దృఢంగా ఉంచేందుకు బ్రౌన్ రైస్ ఎంతగానో దోహదపడుతాయి. ఈ బ్రౌన్ రైస్‌లో మెగ్నిషియం, క్యాల్షియం అధికంగా ఉంటాయి. దీనిలో సెలీనియం గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. హైబీపీ అదుపులో ఉంటుంది. రక్తసరఫరా మెరుగుపడుతుంది. ప్రతిరోజూ బ్రౌన్ రైస్ తీసుకోవడం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఈ బియ్యంలో ఉండే పాస్పరస్ శరీరంలో ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది. 
 
ఆకలిని నియంత్రించుటలో ఈ బియ్యం ఎంతోగానో సహాయపడుతాయి. ఇందులో ఉండే మెగ్నిషియం శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. దీంతో అలసట, నీరసం వంటి చికాకులు తొలగిపోతాయి. చురుగ్గా కూడా ఉంటారు. ఈ బ్రౌన్ రైస్ తీసుకునే వారికి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం 13 శాతం వరకు తగ్గుతుందని అధ్యయంలో చెప్పబడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments