Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ బ్రౌన్ రైస్ తీసుకుంటే?

ప్రస్తుత తరుణంలో పాలిష్ చేసిన బియ్యాన్నే ఎక్కువగా తీసుకుంటున్నాము. కానీ అది మంచిది కాదు. పూర్వికులు దంపుడు బియ్యాన్నే తినేవారు. ఈ బియ్యాన్ని తీసుకోవడం వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. పాలిష్

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (10:19 IST)
ప్రస్తుత తరుణంలో పాలిష్ చేసిన బియ్యాన్నే ఎక్కువగా తీసుకుంటున్నాము. కానీ అది మంచిది కాదు. పూర్వికులు దంపుడు బియ్యాన్నే తినేవారు. ఈ బియ్యాన్ని తీసుకోవడం వలన వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. పాలిష్ చేసిన బియ్యాన్ని తీసుకోవడం వలన అనారోగ్యాలకు గురియగుతున్నారు. అందువలన వాటికి బదులుగా బ్రౌన్ రైస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
ముడి బియ్యం తీసుకోవడం వలన అనేక పోషకాలు అందడంతోపాటు పలు అనారోగ్య సమస్యలు నుండి విముక్తి చెందవచ్చును. మరి ఈ బియ్యంలో గల లాభాలను తెలుసుకుందాం. డయోబెటిస్ ఉన్నవారికి ఈ బియ్యం చాలా సహాయపడుతాయి. ఈ ముడిబియ్యంలో ఉండే ఫైటిక్ యాసిడ్, ఫైబర్, పాలిఫినాల్స్, సంక్లిష్టమైన కార్బొహైడ్రేట్స్ రక్తంలోకి గ్లూకోజ్ విడుదలయ్యే ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. తద్వారా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.  
 
ఎముకలను దృఢంగా ఉంచేందుకు బ్రౌన్ రైస్ ఎంతగానో దోహదపడుతాయి. ఈ బ్రౌన్ రైస్‌లో మెగ్నిషియం, క్యాల్షియం అధికంగా ఉంటాయి. దీనిలో సెలీనియం గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. హైబీపీ అదుపులో ఉంటుంది. రక్తసరఫరా మెరుగుపడుతుంది. ప్రతిరోజూ బ్రౌన్ రైస్ తీసుకోవడం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఈ బియ్యంలో ఉండే పాస్పరస్ శరీరంలో ఉండే కొవ్వును కూడా కరిగిస్తుంది. 
 
ఆకలిని నియంత్రించుటలో ఈ బియ్యం ఎంతోగానో సహాయపడుతాయి. ఇందులో ఉండే మెగ్నిషియం శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. దీంతో అలసట, నీరసం వంటి చికాకులు తొలగిపోతాయి. చురుగ్గా కూడా ఉంటారు. ఈ బ్రౌన్ రైస్ తీసుకునే వారికి పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం 13 శాతం వరకు తగ్గుతుందని అధ్యయంలో చెప్పబడుతోంది. 

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments