Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంపుడు బియ్యం ప్రయోజనాలు

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (18:22 IST)
తెల్లగా పాలిష్ పట్టిన తెల్ల బియ్యం కంటే దంపుడు బియ్యంలో పోషకాలు ఎక్కువ, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో వుండే పోషకాలు ఏమిటో, అవి ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము. ముడి బియ్యంలో వరి పొట్టు కింద బియ్యం పైన వుండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. వారానికి ఐదు కంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు చెపుతున్నారు.
 
దంపుడు బియ్యంలో రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం పాళ్లు తక్కువ. మనం తినే ఆహారాన్ని శక్తిగా మలచడంలో కీలక పాత్ర పోషించే నియాసిన్, విటమిన్ బి3 దంపుడు బియ్యంలో ఎక్కువ. దంపుడు బియ్యం తినేవారిలో గుండె సమస్యలు రావనీ, కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా ఇవి అడ్డుకుంటాయని చెపుతున్నారు.
 
దంపుడు బియ్యంలోని పిండిపదార్థం నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంత త్వరగా పెరగవు. బ్రౌన్ రైస్ లో పీచు పదార్థం ఎక్కువగా వుండటంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి బరువు అదుపులో వుంటుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments