Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యం యవ్వనంగా ఉండాలంటే ఈ పని చేయండి..

చాలా మంది వయసు మీదపడుతున్నా నిత్య యవ్వనంగా ఉండాలని పరితపిస్తుంటారు. ముఖ్యంగా, మోడలింగ్ చేసేవారు, సినీ సెలెబ్రిటీలు, కొందరు రాజకీయ నేతలు మాత్రం ఎపుడు చూసినా చాలా చలాకీగా, యవ్వనంగా కనిపిస్తుంటారు. దీనిక

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (15:46 IST)
చాలా మంది వయసు మీదపడుతున్నా నిత్య యవ్వనంగా ఉండాలని పరితపిస్తుంటారు. ముఖ్యంగా, మోడలింగ్ చేసేవారు, సినీ సెలెబ్రిటీలు, కొందరు రాజకీయ నేతలు మాత్రం ఎపుడు చూసినా చాలా చలాకీగా, యవ్వనంగా కనిపిస్తుంటారు. దీనికి కారణం వారు తీసుకునే ఆహారంతో పాటు.. నీరు.
 
నీరు ఒక మనిషికే కాదు, సమస్త ప్రాణికోటికి కూడా ఒక అద్భుతపానీయంగా చెబుతుంటారు. భూగోళం 70 శాతం వరకు నీటితోనే నిండి ఉంటుంది. ఆ నీటిలో సైతం ఎక్కువ శాతం ఉప్పునీరే. మిగిలిన కొద్దిశాతం మాత్రమే తాగునీరుగా ఉంది. అలాంటి అద్భుతమైన పానీయమైన నీరును రోజు ఎంత ఎక్కువ మోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. 
 
ప్రతి రోజూ క్రమం తప్పకుండా రోజుకు 7 లేదా 8 గ్లాసుల నీరు తాగినట్టయితే యవ్వనంగా ఉండొచ్చని చెబుతున్నారు. అలాంటి నీటితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం. 
 
* నీరు శక్తిని పెంచుతుంది. అలసటను దూరం చేస్తుంది. 
* మెదడులో ఎక్కువశాతం నీరే ఉండడంతో నీటిని తాగడం వల్ల ఆలోచన పెరుగుతుంది. 
* ఏకాగ్రత్త పెరగడంతో పాటు చురుకుగా, చలాకీకా ఉండొచ్చు. 
* భోజనం ముందు నీటిని తాగితే తినే ఆహారాన్ని తక్కువగా తీసుకోవచ్చు. 
* తద్వారా కొవ్వును కరిగించడమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. 
* నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు చెమట, మూత్రం రూపంలో బయటకు వెళ్తాయి. 
* తద్వారా మూత్ర పిండాల్లో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంచుతుంది.
* చర్మం పొడిబారకుండా ఉండి, తాజాగా ఉంటాం. 
* నీరు ఎక్కువగా తాగే వారికి రోగాలు వచ్చే శాతం తక్కువ. 
* మలబద్దకాన్ని దూరం చేస్తుంది. 
* శరీరానికి సరైన క్రమంలో నీరు అందడం వల్ల కీళ్ల కదలికకు అవసరమైన ద్రవాలు ఉత్పత్తి అవుతాయి. 
* నీటిని కావాల్సినంతగా తీసుకోవడం వల్ల శరీరం చక్కగా పనిచేస్తుంది. 
* శరీరం నుంచి మూత్రం, చెమట రూపంలో రోజుకు మూడు లీటర్ల నీరు బయటకు పోతుంది.
* ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నీరు తాగడం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments