Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర వ్యాధికి విరుగు కనిపెట్టండి: శాస్త్రవేత్తలకు వెంకయ్య పిలుపు

దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న చక్కెర వ్యాధిని శాశ్వతంగా నయం చేసే మందులను కనిపెట్టాలని దేశ శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి, ఐఐఐఎం

Webdunia
మంగళవారం, 29 మే 2018 (09:13 IST)
దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న చక్కెర వ్యాధిని శాశ్వతంగా నయం చేసే మందులను కనిపెట్టాలని దేశ శాస్త్రవేత్తలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి, ఐఐఐఎం సోమవారం జమ్మూలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
 
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడంపై దృష్టి పెట్టాలని కోరారు. మలేరియా, చికెన్‌గున్యా, డెంగీ వంటి వ్యాధుల నివారణపైనా దృష్టి కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధిలో సైన్స్‌కు విశేషమైన స్థానం ఉందని, చౌకగా ఔషధాలు లభ్యం కావడంతోపాటు ఆహార భద్రత, పాలఉత్పత్తి, అంతరిక్షం తదితర రంగాల్లో తనదైన ముద్ర వేసిందని గుర్తుచేశారు. 
 
పరిశోధనలు ఖచ్చితంగా విద్యావ్యవస్థలో అంతర్భాగం కావాలన్నా రు. మన దేశాన్ని విజ్ఞానవంతమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి, ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చడానికి పరిశోధనలపై దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు. ప్రతి విషయాన్నీ ప్రశ్నించి, వాటికి సమాధానాలు తెలుసుకొనేలా చిన్నారులు, యువతను ప్రోత్సహించాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments