Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రెండు కొత్త కరోనా లక్షణాలు ప్రకటించిన ఏపీ సర్కారు!

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (09:10 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తోంది. ఈ వైరస్ అడ్డుకట్టకు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... ఫలితం మాత్రం నామమాత్రంగానే ఉంది. ఈ క్రమంలో ఇపుడు కొత్తగా మరో రెండు కరోనా లక్షణాలను ఏపీ సర్కారు వెల్లడించింది. 
 
కరోనా వైరస్ బారినపడిన వారికి జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని ఇది వరకు నిర్ధారించారు. 
 
అయితే ఇప్పుడు తాజాగా కరోనా లక్షణాల్లో మరికొన్ని చేరినట్లు ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్ పేర్కొంది. ఈ మేరకు అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అనే సంస్థ కరోనా వైరస్‌ లక్షణాలకు సంబంధించి కీలక ప్రకటనను జారీ చేసినట్లు తెలిపింది. 
 
సీడీసీ ప్రకటన మేరకు... వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలే అని తెలిపింది. కొత్తగా కనుగొన్న వాటితో కలిపి మొత్తం 11 లక్షణాలను సీడీసీ తన అధికారిక జాబితాలో చేర్చింది. అధికారిక వెబ్‌సైట్‌లో కూడా వీటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కనిపిస్తాయని ఏపీ కొవిడ్ కంట్రోల్ రూమ్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

తర్వాతి కథనం
Show comments