Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి పండును తింటే ఆ వ్యాధి తగ్గుతుంది

బొప్పాయి పండులో ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియంతోపాటు ఇతర ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ ఎ, బి, సి, డి ఎక్కువగా లభిస్తాయి. దీనిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తరచుగా దీనిని ఆ

Webdunia
మంగళవారం, 22 మే 2018 (11:07 IST)
బొప్పాయి పండులో ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియంతోపాటు ఇతర ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ ఎ, బి, సి, డి ఎక్కువగా లభిస్తాయి. దీనిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తరచుగా దీనిని ఆహారంగా తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 
 
శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం ఉదరమే కనుక బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటే మంచిది. ఇందులోని విటమిన్ ఎ శరీర చర్మానికి, కళ్ళకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కంటి వ్యాధులను దూరం చేసెందుకు ఉపయోగపడుతుంది. ఇది రక్తనాళికలను శుభ్రం చేయడంతో పాటు గుండె, నరాలు, కండరాల పనితీరును మరింత చురుగ్గా తయారుచేయుటకు సహాయపడుతుంది.  
 
బొప్పాయిలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే పొటాషియం గుండె జబ్బులకు, విటమిన్ కె ఎముకలను గట్టి పరుస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. పండిన బొప్పాయి గ్రీన్ టీలో కలుపుకుని తీసుకుంటే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. మానసిక ఆందోళనను దూరంచేయుటకు ఉపయోగపడుతుంది.
 
బొప్పాయి పండు తినడం వలన ఆస్తమా వ్యాధికి నివారించుటకు సహాయపడుతుంది. డెంగు వ్యాధి నివారణకు బొప్పాయి ఆకుల రసాన్నీ తీసుకుంటే చాలా మంచిది. తెగిన, కాలిన గాయాలపై బొప్పాయి గుజ్జును పెట్టుకున్నట్లైతే గాయాలు త్వరగా మానుతాయి. గర్భిణీ స్త్రీ ఎట్టి పరిస్థితులలోనూ బొప్పాయా పండును తినరాదు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments