Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సీతాఫలం పండు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (21:21 IST)
వర్షాకాలం ప్రారంభమవగానే సీతాఫలాలు మార్కెట్లో కనబడతాయి. వీటిలో సి విటమిన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇతర పండ్లతో పోల్చుకుంటే వాటి ధర కూడా తక్కువే. ఇలాంటి పండ్లను ఎక్కువగా తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

సీతాఫలాల్లో సి విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. రోజూ ఒక సీతాఫలం పండును తినడం వల్ల మన శరీరంలోని వ్యర్థ పదార్ధాలు బయటకు పంపిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఎ విటమిన్‌ కంటిచూపు మెరుగుపడడానికి దోహదపడుతుందని వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, జుట్టు ఒత్తుగా పెరగాలని ఆశపడే మహిళలు చక్కగా సీతాఫలం పండ్లను తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినడం వల్ల సమస్య అదుపులో ఉంటుందని చెపుతున్నారు.ఈ పండ్లలో ఉండే మెగ్నీషియం కండరాలను దృఢంగా ఉంచుతుంది. ఇందులోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, దాని పనితీరును మెరుగుపరుస్తుంది. 
 
ఈ పండ్లలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయివున్న కొవ్వును కరిగించడంలో కీలకపాత్రను పోషిస్తాయి. బలహీనంగా ఉండే చిన్న పిల్లలకు సీతాఫలాలను ఎంత ఎక్కువగా తినిపిస్తే అంత మేలని వైద్యులు చెపుతున్నారు. ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కడుపులో మంట, జీర్ణ సంబంధ సమస్యలున్నవారు ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే డైటింగ్‌ చేసేవారు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

తర్వాతి కథనం
Show comments