వేసవికాలంలో పండ్లు, ఆకుకూరలను తీసుకుంటే?

Webdunia
ఆదివారం, 22 మార్చి 2020 (11:47 IST)
వేసవికాలంలో పుదీనా, కీరా దోసకాయ, పెరుగు, లస్సీ వంటివి తీసుకోవడం వల్ల కూడా శరీర వేడి తగ్గుతుంది. అలాగే మజ్జిగను తీసుకుంటే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్లాస్ గోరువెచ్చని పాలల్లో తేనె కలుపుకొని రోజూ తాగితే వేడిని తగ్గించుకోవచ్చు. వేసవిలో గసగసాలను పొడిచేసి వేడి పాలలో కలుపుకొని తాగాలి. పుచ్చకాయ తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. 
 
రోజు ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ రెండు సార్లు కొబ్బరి నీళ్లు తప్పనిసరిగా తాగాలి. రోజూ స్పూన్ మెంతుల్ని ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే నిత్యం కాసేపు వ్యాయమం చేసిన తర్వాత గుప్పెడు ద్రాక్షలను తీసుకుంటే అలసిపోయిన శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. అలసటలో ఉన్నప్పుడు కూడా గ్రేప్స్ తీసుకున్నట్టయితే.. శరీరం వెంటనే ఉత్తేజితమయ్యే అవకాశాలు అధికం. 
 
లీచి పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్-సి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి, రోగం తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్స్, వైరస్‌లతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. అంతేకాదండోయ్.. శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్‌ను సరఫరా చేసి అధిక బరువును కూడా తగ్గిస్తుంది. వేసవిలో పండ్లు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీర తాపానికి చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

తర్వాతి కథనం
Show comments