Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేసేటప్పుడు ఇటువంటి నియమాలు పాటించండి....

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (17:10 IST)
చాలామంది భోజనం చేసేందుకు కూడా టైం లేదని చెపుతుంటారు. కానీ వాళ్లు చేస్తున్న పనికి మాత్రం టైం దొరుకుతుంది. అలాంటిది జీవించేందుకు భుజించే భోజనం చేసేందుకు టైం లేకపోవడం ఏంటి...? ఆ ప్రశ్నకు తావుండకూడదు. కనుక అలాంటివారు ముందుగా తెలుసుకోవలసిన విషయం... నిర్ణీత వేళకు భోజనం ముగించాలి. ఆహారం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. అంతేగాని గబగబా మింగేయకూడదు. ఆహారాన్ని నమిలి తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అలాగే నోట్లోని లాలాజలం ఆహారంతో కలిసి కడుపులోకి ప్రవేశిస్తుంది. 
 
భోజనం తీసుకునేటప్పుడు కడుపు నిండుగా భుజించకూడదు. ఎంతగా రుచికరమైనా కూడా, మీకిష్టమైన ఆహార పదార్థాలున్నా కూడా తగినంత ఆహారమే తీసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. జీర్ణాశయాన్ని 1/4వ వంతు భాగం ఖాళీగా ఉంచి 3/4 వంతు మాత్రమే నింపాలి. 
 
సహజంగా చాలామంది ఆకలి వేసినప్పుడు నీళ్ళు ఎక్కువగా తాగుతుంటారు. ఆలా చేయడం ఆరోగ్యానికి ఏమంత మంచిదికాదు. అలాగే మరికొంతమంది దప్పిక వేసినప్పుడు భోజనం చేస్తుంటారు. ఇదికూడా విపరీత ధోరణులకు దారితీస్తుందంటున్నారు వైద్యులు. 
 
మీరు భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగాలనిపిస్తే కాసింత నీళ్ళు మాత్రమే త్రాగండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ముఖ్యంగా భోజనానికి అరగంట ముందు అలాగే భోజనం అయిన తర్వాత అరగంట వరకు నీళ్ళు త్రాగకూడదంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఎందుకంటే భోజనానికి ముందు మీ కడుపులో లాలాజలం, ఎంజైములు చేరి వుంటుంది. 
 
ఇవి జీర్ణక్రియలో బాగా తోడ్పడుతాయి. భోజనం చేసినప్పుడు ఈ లాలాజలం, ఎంజైములు ఆహారంతోబాటు కలిసి జీర్ణక్రియలో తోడ్పడుతాయి. భోజనం చేసిన అరగంట తర్వాత నీళ్ళను త్రాగితే జీర్ణమయిన ఆహారం పూర్తిగా నీటితో కలిసి అందులో ఉన్న పోషక విలువలు శరీరానికి చేరుతాయి. మిగిలిన వ్యర్థ పదార్థాలు ఈ నీటి ద్వారా బయటకు వచ్చేస్తాయంటున్నారు. అలాగే శరీరం ఆరోగ్యంగా కూడా ఉంటుందంటున్నారు.
 
మీకు ఎన్ని పనులున్నా కూడా వాటిని పక్కన పెట్టి సమయానుసారం ఆహారాన్ని భుజించండి. ఆ తర్వాతే మీ కార్యక్రమాలను ముగించుకోండి. చద్ది అన్నం లేదా ఇతర ఆహార పదార్థాలను మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఆహారంగా తీసుకోకండి. అలాగే రెండవసారి వేడి చేసిన ఆహార పదార్థాలను కూడా భుజించకండి. మీరు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యాకే మరోసారి ఆహారాన్ని తీసుకోండి. అంతేగాని సమయం అయ్యింది కదా అని ఆకలి వేయకున్నాకూడా భోజనాన్ని తీసుకోకండి. రాత్రిపూట ఆకలి వేయకపోతే కేవలం పండ్లు మాత్రం తిని పడుకోండి. దీంతో మీ జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. 
 
ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితగమనంలో విశ్రాంతి తీసుకునేందుకు సమయం చాలడం లేదు. దీంతో భోజనం తిన్న వెంటనే నిద్రకుపక్రమిస్తుంటారు చాలామంది. ఇలా చేయడం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదంటున్నారు వైద్యులు. కాసేపు నడక సాగించండి. లేదా పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ఇంటి ఆరుబయట తిరుగాడండి. అలా తిరిగిన తర్వాత నిద్రకుపక్రమించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ముఖ్యంగా రాత్రిపూట భోజనం ముగించిన వెంటనే కోపతాపాలకు తావివ్వకండి. కోపం చెందితే శరీరంలో ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి మూల కారణమవుతుందని సూచిస్తున్నారు వైద్యులు. వీలైతే రాత్రి భోజనం ముగించిన తర్వాత పడుకునే ముందు గోరువెచ్చని పాలను త్రాగండి. దీంతో సుఖవంతమైన నిద్రతోబాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్ఎంపీ ఇంటి తాళం పగులకొట్టి బంగారం కొట్టేశాడు.. దొంగ ఎవరంటే?

బర్త్ డే కేక్ మీద కొవ్వొత్తి, స్ప్రే కొడుతుండగా ముఖానికి అంటుకున్న మంట (video)

నలుగురు కుమారులు-చిప్స్, కూల్ డ్రింక్స్ తీసిచ్చి రైలు కింద తోసేసిన తండ్రి.. ఆపై?

నాలుగో తరగతి గొడవ - 62 యేళ్ళ వయసులో కొట్టుకున్నారు...

Gali Janardhan Reddy: అక్రమ మైనింగ్ కేసు- గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు భారీ ఊరట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

తర్వాతి కథనం
Show comments