Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమలపాకు ఓకే.. కిళ్లీలు ఎక్కువగా తిన్నారో.. కిడ్నీలో రాళ్లు తప్పవా?

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (16:16 IST)
pan masala
తమలపాకులో ఉన్న ఆరోగ్య రహస్యాలు అంతా ఇంతా కాదు. అయితే ఆకులోకి వక్క, సున్నం తో పాటు కాసింత జాజికాయ, పచ్చ కర్పూరం, కుంకుమ పుష్పం, యాలకుల పొడి, కస్తూరి మొదలైనవి వాడతారు. ఇవన్నీ ఆయుర్వేద పరంగా ఆరోగ్యాన్ని చేకూర్చేవి. 
 
ఎముకలను దృఢంగా ఉంచడానికి ఉపయోగపడే కాల్షియం విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి సమృద్ధిగా మన శరీరానికి అందుతాయి. తాంబూలం వల్ల జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా ఉంటుంది. పాన్ లేదా కిల్లి లను తాంబూలమనే చాలామంది అనుకుంటారు. 
 
అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం.. పాన్ తయారీలో ఆకు వక్క సున్నం కాకుండా ఇతర పదార్థాలు వాడుతారు. కృత్రిమ రంగులు, కృత్రిమ సువాసనలు జతచేసి, చూడటానికి కళాత్మకంగా చేసినా ఆరోగ్యానికి పాన్​లు అంత మంచివి కాదు. 
 
స్వీట్ పాన్(sweet paan), డ్రై ఫ్రూట్ పాన్, చాక్లెట్ పాన్(chocolate paan) అంటూ రకాలు తీసుకువచ్చినా మన సంప్రదాయమైన తాంబూలం ఇచ్చిన ఫలితాలను మాత్రం ఇవ్వలేవు. రోజుకు 5 నుంచి 10 తమలపాకులను తినే అలవాటు రెండేళ్ల కంటే ఎక్కువ ఉంటే .. డ్రగ్స్ మాదిరిగా వాటికి బానిసలవుతారట. 
 
అలాగే అధిక రక్తపోటు గల వ్యక్తులు కూడా తాంబూలానికి దూరంగా ఉండాలి. తమలపాకు తిన్న తర్వాత పొగ తాగినా లేదా పొగాకును కలిపి తిన్నా సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ లాంటి ప్రమాదకర నోటి వ్యాధులు వస్తాయి. ఇది నోటి క్యాన్సర్ సంబంధిత సంకేతం. 
 
కాబట్టి .. తమలపాకులను మితంగా తీసుకుంటే ఔషధం, అతిగా తీసుకుంటే విషం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిళ్లీ లేదా పాన్​లు ఎక్కువగా తినేవారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అందుకు తమలపాకులపై రాసిన సున్నమే (Lime) కారణం కావచ్చంటున్నారు. వక్కలు తినేవారికి దీర్ఘకాల కిడ్నీ జబ్బులు వస్తున్నాయన్నారు. వీరిలో విటమిన్​ డీ స్థాయిలు కూడా పడిపోతూ ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు. 
 
ఇంకా మధుమేహ రోగులైతే వెంటనే పాన్​ మానేయాలని లేకుంటే రోగం ముదురుతుందని సూచిస్తున్నారు. యువతలో బెల్లీ ఫ్యాట్​ కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధం ఉందని తెలిసి భర్తను హత్య చేసిన భార్య

మానవత్వానికే మచ్చ : దత్తత బాలికపై కన్నతండ్రే అత్యాచారం..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

తర్వాతి కథనం
Show comments