Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్నాక ప్రాణాయామం చేయొచ్చా?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (11:43 IST)
సాధారణంగా కరోనా వైరస్ బారిన కోలుకున్న వారికి ఊపిరితిత్తులు ఎంతోకొంత బలహీనపడతాయి. కాబట్టి వాటికి ఏ స్వల్ప ఇబ్బంది కలిగినా వాటి సామర్ధ్యం మరింత తగ్గిపోతుంది. వీరికి ఎసిడిటీ ఉంటే, పడుకున్న సమయంలో గొంతులోకి తన్నుకొచ్చే యాసిడ్లు స్వల్ప పరిమాణాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఇలా చేరుకున్న యాసిడ్‌ వల్ల ఊపిరితిత్తులు క్రమేపీ మరింత బలహీనపడతాయి. కాబట్టి ఎసిడిటీ ఉన్నవాళ్లు వైద్యుల సూచన మేరకు దాన్ని తగ్గించే మందులు వాడవలసి ఉంటుంది. 
 
ముఖ్యంగా, కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఊపిరితిత్తులను బలపరిచే ప్రాణాయామం చేయడం సరికాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌తో బలహీనపడిన ఊపిరితిత్తులు ప్రాణాయామంలో తీసుకునే వేగవంతమైన శ్వాస ప్రక్రియలతో మరింత అసౌకర్యానికి లోనవుతాయి. 
 
బలంగా, వేగంగా శ్వాస తీసుకుని వదిలే వ్యాయామాలతో ఊపిరితిత్తుల మీద పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రారంభంలో అలోమ, విలోమ వ్యాయామాలు చేయడం మేలు. ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకుని, ప్రాణాయామానికి అనువుగా మారినట్టు వైద్యులు ధ్రువీకరించిన తర్వాతే భస్త్రిక వంటి ప్రాణాయామ ప్రక్రియలను సాధన చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీలో వర్షాలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 : 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుస్తున్నారు : నాగబాబు

గణిత ఉపాధ్యాయుడికి గౌరవ డాక్టరేట్ ప్రదానం

భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. సర్వదర్శనానికి 18 గంటలు

పరాయి మహిళతో సంబంధం పెట్టుకున్నావంటూ వేధింపులు.. భార్యను గొంతుపై కాలుతో తొక్కి చంపేసిన భర్త....

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments