Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైనాపిల్ తీసుకుంటే.. చంటి పిల్లలకు బాగా పండిన రసాన్నిస్తే..?

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (18:57 IST)
పైనాపిల్ తీసుకోవడం ద్వారా ఆస్తమాను దూరం చేసుకోవచ్చు. పైనాపిల్‌లోని బీటా-కెరోటిన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌నుంచి రక్షిస్తుంది. మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు నుండి ర‌క్షిస్తుంది. దంతాలూ చిగుళ్లూ వంటివి బలంగా ఉండేందుకూ ఇది దోహదపడుతుంది. పుల్లపుల్లగా, తీయతీయగా ఉన్న పైనాపిల్‌ పండు రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి. అదే విధంగా పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది. 
 
తల్లిపాలు తగినంతగా లేని చంటి పిల్లలకు బాగా పండిన పైనాపిల్ పండు రసం ఇస్తే చాలా మంచిది. పైనాపిల్‌ పండు ముక్కల్ని తేనెలో ఇరవై నాలుగు గంటలు ఉంచి తింటే అజీర్తి పోతుంది. పైనాపిల్ పండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. 
 
ఈ పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తుంది. మ‌రో విశేషం ఏంటంటే పచ్చి పైనాపిల్‌ రసం తెగిన గాయాలపై వేస్తే రక్త స్రావం అరికడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

తర్వాతి కథనం
Show comments