Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్పాహారంలో నీళ్లకు బదులు పాలు వాడితే..

అల్పాహారంలో కోడిగుడ్డు, తృణధాన్యాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తద్వారా మధుమేహం, ఒబిసిటీ ఆవహించదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఉదయం అల్పాహారం సమయంలో పాలు తాగితే మధుమేహం టైప్

Webdunia
ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (10:52 IST)
అల్పాహారంలో కోడిగుడ్డు, తృణధాన్యాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తద్వారా మధుమేహం, ఒబిసిటీ ఆవహించదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఉదయం అల్పాహారం సమయంలో పాలు తాగితే మధుమేహం టైప్‌ 2 రోగులకు మంచిదని పరిశోధనలో వెల్లడి అయ్యింది. అధిక ప్రొటీన్లు గల పాలును ఉదయం పూట తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్‌స్థాయిలు అదుపులో ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. 
 
అంతేగాకుండా.. అల్పాహారంగా తృణధాన్యాలు తినేవారు తాగునీరు బదులు పాలు వాడితే రక్తంలో గ్లూకోజ్‌ గాఢత తగ్గుతుంది. తక్కువ ప్రొటీన్లు ఉన్న పాల ఉత్పత్తుల కంటే మధ్యాహ్న భోజనంలో అధిక ప్రొటీన్లు గల పాల ఉత్పత్తులు వినియోగించినా రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు తగ్గినట్లు పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
తద్వారా ఆకలి కూడా తగ్గుతోంది. పాలలో ఉండే పాలమీగడ, కేసైన్‌ ప్రొటీన్లు విడుదల చేసే గ్యాస్ట్రిక్‌ హార్మోన్ల కారణంగా ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతోంది. దీనివలన ఆహారం మోతాదు అధికంగా తీసుకోకుండా మితంగా తీసుకునే వీలుంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments