Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంకుడుకాయ పొగను పీల్చితే ఆ సమస్య తగ్గుతుంది

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (19:56 IST)
ప్రస్తుతం షాంపులు వచ్చాయి. కానీ ఒకప్పుడు ప్రతి ఇంట్లో కుంకుడు కాయ పులుసుతోనే తలంటుకునే వారు. కుంకుడు కేవలం తలంటు కునేందుకే కాక అద్భుతమైన ఆయుర్వేద విలువలను కలిగి ఉన్నది. అనేక రకాలైన రోగాల్ని నయం చేస్తుంది. నేటికీ పెద్ద వయస్సు ఉన్న వారు ఇళ్లలో ఉంటే వారు కుంకుడు కాయతోనే తలంటుకుంటాడు. పిల్లలైతే కుంకుడు కాయ అంటే ఆమడదూరం పరుగెడతారు. చేదుగా ఉండే కుంకుడు కాయరసం కంట్లో పడిందా ఒళ్ళు తెరవనీయక మంట పుట్టిస్తుంది. అందుకే పిల్లలు దీనికి దూరంగా ఉంటారు.
 
కుంకుడు కాయ చేదుగా ఉంటుంది. దీని రసం నురగతో ఉంటుంది. ఇది క్రిమి సంహారిణిగా ఉపయోగపడుతుంది. కుంకుడు కాయలో ఉండే గింజను బద్దలుకొడితే పప్పు ఉంటుంది. ఇది ఉబ్బసాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. హిస్టీరియా వ్యాధిలో కుంకుడు కాయ పొగను వేసి ఆ పొగను వాసన పీల్చేలా చేస్తే వారు స్పృహలోకి వస్తారు. హిస్టీరియా రోగికి చితక కొట్టిన కుకుండు కాయను నీటితో పిసికి ఆ రసాన్ని రోగి ముక్కు రంధ్రాలలో ఒకటి లేక రెండేసి చుక్కలు వేస్తే వెంటనే స్పృహలోకి వస్తారు.
 
కుంకుడు కాయ రసంతతో తలంటుకుంటుంటే చుండ్రు తగ్గిపోతుంది. కురుపులను కుంకుడు కాయ రసంతో కడుగుతూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. చిడుము వ్యాధిలో కుంకుడు అద్భుతంగా పనిచేస్తుంది. తామర వ్యాధిలో ముందుగా తామర వ్యాధి ఉన్న ప్రాంతంలో కుంకుడు కాయరసంతో శుభ్రం చేసి ఆ తర్వాత జిల్లేడు పాలు రాయాలి. 
 
తేలు, జెర్రి కాటులకు కుంకుడు కాయ గుజ్జును ఆ ప్రాంతంలో వ్రాయాలి. బాధపోయేదాకా రుద్దాలి. కుంకుడు కాయల చిక్కటి రసం ఒక్కో ముక్కులో రెండు చుక్కలు వేస్తే ఎంతటి తలనొప్పి అయినా వెంటనే తగ్గిపోతుంది. కుంకుడు ఆకులను తలకు కట్టినా దారుణమైన తలనొప్పి కూడా తగ్గుతుంది. దురదులకు కుంకుడు కాయ రసంతో స్నానం చేయాలి. కుంకుడు కాయల రసం పేలను చంపేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments