Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారి కోసం....

రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారికి కళ్ళు అలసటగా ఉంటాయి. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. గ్రీన్ టీ బ్యాగులను కంటిపై 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇల

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (13:05 IST)
రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారికి కళ్ళు అలసటగా ఉంటాయి. ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. గ్రీన్ టీ బ్యాగులను కంటిపై 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన కంటి అలసట తగ్గుతుంది. అలానే కంటి అలర్జీలు, వాపు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
 
కీరదోసను చిక్కచిక్క ముక్కలుగా కట్‌చేసుకుని వాటిని కంటిపై ఉంచుకుంటే కూడా కంటి అలసట తగ్గుతుంది. అలాకాకుంటే కీరదోస రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని అందులో దూదిని ముంచి కళ్లపై పెట్టుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అదేపనిగా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారు వ్యాయామాన్ని తప్పకుండా చేయాలి. 
 
ముందుగా కళ్లను గుండ్రంగా తిప్పాలి. ఆ తరువాత కుడి, ఎడమవైపులా తిప్పాలి ఇలా ప్రతిరోజూ సమయం దొరికిన్నప్పుడంతా చేస్తే కంటి అలసటం తగ్గుతుంది. అలాకాకుంటే పాలలో కొద్దిగా తేనెను కలుపుకుని కంటి చుట్టూ నెమ్మదిగా దూదితో మర్దన చేసుకోవాలి. ఇది బాగా ఆరిన తరువాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే కంటికి మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
బంగాళాదుంపను తురిమి దాన్ని కంటిపై పెట్టుకోవాలి. అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి మంటలు తొలగిపోతాయి. అలసట పోవడమే కాకుండా కంటి కిందటి నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

MBBS Student: వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

తెలంగాణ: రూ.5.21 లక్షల అబార్షన్ కిట్లు, మందులు కూడా స్వాధీనం

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments