బీట్‌రూట్ రసం తాగిన 24 గంటల్లో..?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (15:51 IST)
కూరగాయలన్నీ పోషణను మాత్రమే ఇస్తాయి అనుకుంటే పొరపాటు. చాలా కూరగాయలు అనేక వ్యాధులకు ఔషధంగా కూడా పనిచేస్తాయి. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సహజసిద్ధంగా వ్యాధులను నయం చేస్తాయి. వాటిలో బీట్ రూట్ కూడా ఒకటి. అధ్యయనాల ప్రకారం నైట్రేట్‌ అధికంగా ఉన్న కూరగాయలను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. 
 
మన శరీరానికి నైట్రేట్‌ను నైట్రిట్‌ అనే రసాయనంగా ఆ తర్వాత నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మార్చే గుణం ఉంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి మాత్రలకు బదులుగా 200 మిలీ బీట్‌రూట్‌ రసాన్ని ఇచ్చి 24 గంటలపాటు పరిశీలనలో ఉంచారు. 
 
ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. అంతే కాకుండా మరో 24 గంటలపాటు రక్తపోటు నియంత్రణలో ఉంది. అందువల్ల హైబీపీతో బాధపడేవారు నైట్రేట్ ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు తరచుగా తినమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓటమి అంచున ఉన్నవారు షరతులు విధించలేరు : ట్రంప్ కాల్పుల విమరణ పొడగింపుపై ఇరాన్ కామెంట్స్

హోమ్ స్టేలో బస చేసిన మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఇద్దరి అరెస్టు

సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం... హోం మంత్రితో భేటీ

మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పితృవియోగం - మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మృతి

స్థానిక కోటాను 95శాతానికి పెంచిన ఆంధ్రప్రదేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

Allu Arjun: పుష్ప సంపాదనకంటే రాకాతో తగ్గేదేలా అంటున్న అల్లు అర్జున్ ?

Disha Patani: రొమాన్స్ జానర్‌లో చరిత్ర సృష్టించడానికి సిద్ధం అవుతున్న దిశాపటానీ

ఆటుపోట్లను దాటి బయటకువస్తున్న పరమపద సోపానం విజయం సాధించాలి : భీమనేని శ్రీనివాసరావు

Chittibabu: దర్శకుడు, నటుడు, బీజేపీ నాయకుడు చిట్టిబాబు కన్నుమూత

తర్వాతి కథనం
Show comments