Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తులసి విత్తనాలను నీటిలో నానబెట్టి...?

తులసి విత్తనాలను నీటిలో నానబెట్టి...?
, సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:37 IST)
తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో.. అదేవిధంగా వాటి విత్తనాలు కూడా అంతే మేలు చేస్తాయి. వీటిని తరచు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందుతాయి. అలానే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చును. మరి ఈ విత్తనాలు రోజూ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఓసారి పరిశీలిద్దాం..
 
తులసి విత్తనాలను మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గ్లాస్ పాలలో కలిపి రోజూ తాగుతుంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. దాంతోపాటు రక్తనాళాల్లో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. అలానే చాలామందికి వయస్సు పెరిగే కొద్ది చర్మం ముడతలుగా మారుతుంది. ఈ సమస్యను తొలగించాలంటే.. నిత్యం తులసి విత్తనాలను తింటూ ఉండాలి. 
 
తులసి విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఈ విత్తనాలు రోజూ తింటుంటే గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ ఎటాక్‌‍లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. ముఖ్యంగా శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి. 
 
శరీరంలోని కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ ర్యాడికల్స్‌ను తులసి విత్తనాల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ అడ్డుకుంటాయి. ఈ విత్తనాలు రక్తహీనత సమస్యను తొలగిస్తాయి. అధిక బరువు గలవారు రోజూ పావుకప్పు తులసి విత్తనాలను నీటిలో నానబెట్టుకుని.. ఆపై విత్తనాలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ విత్తనాల్లో కొద్దిగా బెల్లం, పెసరపప్పు కలిపి తింటుంటే మంచిది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో జామపండ్లు ఆరగిస్తే...