Webdunia - Bharat's app for daily news and videos

Install App

సబ్జా గింజలను నీళ్లల్లో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగితే?

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (19:23 IST)
Sabja Seeds
వేసవిలో ఆరోగ్యానికి సబ్జా గింజలు ఎంతగానో మేలు చేస్తాయి. సబ్జా గింజలను తీసుకుంటే.. వేసవిలో ఉష్ట తాపాన్ని దూరం చేసుకోవచ్చు. అంతేగాకుండా సబ్జా గింజలను నీటిలో వేసి తాగడం ద్వారా శరీరంలోని వ్యర్థాలన్నీ తొలగిపోతాయి. ఈ సబ్జా గింజలు వేసవిలో యాంటీ బయోటిక్‌లా పనిచేస్తాయి. సబ్జా గింజలను గంటల పాటు లేదా రెండు గంటల పాటు నీటిలో వేసి వుంచి.. ఆ నీటిని సేవించడం ద్వారా శరీరంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. 
 
ఈ నీళ్లు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. ఈ నీటిని రాత్రి పూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. వేసవిలో ఏర్పడే చర్మ సమస్యలను సబ్జా గింజలు దూరం చేస్తాయి. 
 
ఇంకా చర్మ సమస్యలు రాకుండా వుండాలంటే.. సబ్జా గింజలను నీళ్లల్లో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది. అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల గుజ్జు వేసి రోజుకు మూడు లేక నాలుగు సార్లు ఇచ్చినా ఫలితముంటుంది. వీటి గుజ్జును పైనాపిల్‌, ఆపిల్‌, ద్రాక్ష రసాల్లో కలిపి పిల్లల చేత తాగిస్తే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు.
 
గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

తర్వాతి కథనం
Show comments