Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు తింటే.. నరాలకు బలం.. అందుకోసం వారానికి రెండుసార్లు..?

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (11:51 IST)
చేపల్లోని ఒమేగా-3 యాసిడ్స్ మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. గుండె సంబంధిత సమస్యలను, ఆస్తమా, క్యాన్సర్లను చేపలు దరిచేరనివ్వవు. డయాబెటిస్‌ను నియంత్రించే చేపలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. 
 
కంటి దృష్టి లోపాలను పోగొడుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే సంతానోత్పత్తికి చేపలు ఉపకరిస్తాయి. చేపలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సంతానలేమిని దూరం చేసుకోవచ్చు. ఇందులోని పోషకాలు మగవారి సంతాన సంబంధ సమస్యలను అడ్డుకుంటాయి. 
 
చేపల్లో వుండే ఒమేగా-3 ఫాటీయాసిడ్స్ శరీర రక్తంలోని ట్రై-గిసరైడ్‌లను తగ్గించటమే కాకుండా, రక్త పీడనాన్ని, రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కావున వారానికి రెండు లేదా మూడు సార్లు చేపలను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నరాల బలహీనతతో బాధపడేవారు వారానికి ఓసారైనా చేపలు తినాలి.
 
నరాల చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా చూసే రక్షణ కవచాలు దెబ్బతిని.. దేహంతో మెదడు అనుసంధానత క్షీణించడంతో నరాల బలహీనత ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫాటీ ఆమ్లాలుండే చేపలు తినడం ద్వారా నరాలకు మేలు జరుగుతుంది. తరచూ చేపలు తినడం, చేప నూనె పోషకాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments