Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప్పు కలిపిన నీరు తీసుకుంటే..?

ఉప్పు కలిపిన నీరు తీసుకుంటే..?
, సోమవారం, 24 డిశెంబరు 2018 (15:37 IST)
మనం ప్రతిరోజూ తీసుకునే పోషక పదార్థాలలో ఉప్పు కూడా ఒకటి. ఉప్పు సరిపడినంత తీసుకుంటే శరీరానికి మంచిదే కానీ దాని మోతాదు ఎక్కువైతే మాత్రం అనారోగ్యం బారినపడక తప్పదు. మరి ఉప్పును నీటిలో కలిపి ప్రతి రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
 
ఉప్పునీటిలో ఉండే సల్ఫర్‌, క్రోమియం వంటి పదార్థాలు చర్మాన్ని మృదువుగా మారేలా చేస్తాయి. అలాగే, చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. బరువు సమస్యతో బాధపడే వారు సులభంగా బరువు తగ్గాలంటే.. రోజూ ఉప్పు నీటిని తీసుకుంటే చాలు.. ఫలితం ఉంటుంది. అధికంగా పేరుకు పోయిన కొవ్వును కరిగించడంలోనూ, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, విష పదార్థాలను తొలగించడంలోనూ ఉప్పునీరు చాలా దోహదపడుతాయి. 
 
ఉప్పునీటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే, ఎముకలు దృఢంగా తయారవుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఉప్పు నీరు ఎంతగానో దోహదం చేస్తాయి. ఉప్పు నీటిని రోజూ తాగడం వలన నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఈ నీరు శరీరంలో ఏర్పడే ప్రమాదకర ఒత్తిడి హార్మోన్లను నియంత్రిస్తుంది. 
 
రోజు ఉప్పుతో దంతాలను శుభ్రం చేసినా.. ఉప్పు నీరు తాగడం వలన దంత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. రక్తంలో అధికంగా ఉన్న చక్కెర స్థాయిలను ఉప్పునీరు తగ్గించి చక్కర వ్యాధిని నియంత్రిస్తుంది. జీర్ణాశయ సమస్యలతో బాధపడేవారికి ఉప్పు నీరు ఔషధంలా పనిచేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీరకాయ తొక్కను ఎండబెట్టి పొడి చేసి తీసుకుంటే ఏమవుతుంది?