పాతాళానికి చికెన్ ధరలు .. ఆ పండు ధరకు రెక్కలు

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (15:31 IST)
కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలైపోతున్నాయి. ఇప్పటికే పౌల్ట్రీ రంగం పూర్తిగా దెబ్బతింది. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందన్న దుష్ప్రచారంతో పాటు... బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ ధరలు పూర్తిగా పడిపోయాయి. పలు ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేస్తుంటే.. మెట్రో నగరాల్లో మాత్రం కేజీ చికెన్ 30 నుంచి రూ.40కి విక్రయిస్తున్నారు. అలాగే, మటన్ ధరలు కూడా కొంతమేరకు తగ్గాయి. 
 
దీంతో మాంసాహార, బిర్యానీ ప్రియులు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. చికెన్, మటన్ బిర్యాలను పుష్టిగా ఆరగించేవారు.. ఇపుడు వాటికి దూరంగా ఉంటూ పనస పండును లాగించేస్తున్నారు. ఫలితంగా నిన్నామొన్నటి వరకు రూ.50 పలికిన పనసపండు ఇపుడు ఏకంగా రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. 
 
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి వేగవంతం అవుతోన్న నేపథ్యంలో.. చికెన్, మటన్‌ల బదులు జాక్ ఫ్రూట్(పనస) తినడం మంచిదని కొందరు చెబుతున్నారు. కాగా మాంసాహారం తింటే కరోనా వ్యాప్తి చెందదని డాక్టర్లు చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం అనుమానం వీడటం లేదు. దీంతో చికెన్, మటన్ రేట్లు భారీగా పడిపోయాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Modi Effect: బంగారం కొనొద్దు.. ప్రయాణాలొద్దు.. వర్క్ ఫ్రమ్ హోమ్‌ చేయాలన్న మోదీ..స్టాక్స్ ఢమాల్

బీస్ట్ మూవీ గెటప్‌పై తమిళనాడు సీఎం సి.జోసెఫ్ విజయ్

కానిస్టేబుల్‌ను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. కత్తితో దాడి

ఆ సర్టిఫికేట్ తేలేదు.. తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన కీర్తన (video)

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : దారుణంగా పడిపోయిన బీజేపీ ఓటు బ్యాంకు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: బండి భగీరథ్‌ పై పోక్సో కేసు తీవ్రంగా కలవరపరిచింది : మంచు మనోజ్

విజయ్ జీవితంలోకి కొందరు పరాన్నా జీవులుగా ప్రవేశించారు : సుచిత్ర

Ali: టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం

Nihal: వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సందిగ్ధం డేట్ ఫిక్స్

Varun Sandesh : నా వైఫ్ మిస్సింగ్ అంటోన్న వరుణ్ సందేశ్

తర్వాతి కథనం
Show comments