Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలమైతేనేం? చద్దన్నంలో కాస్త గంజి నీళ్లు కలుపుకుని తాగాల్సిందే...?

కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చుని పనిచేయడం.. శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్య సమస్యలు అవంతట అవే వెతుక్కుంటూ వస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం.. వట్టి మెదడుకే పనెక్కువ ఇవ్వడం ద్వారా ఊబకాయం, రక్తపోటు

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (14:00 IST)
కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చుని పనిచేయడం.. శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్య సమస్యలు అవంతట అవే వెతుక్కుంటూ వస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం.. వట్టి మెదడుకే పనెక్కువ ఇవ్వడం ద్వారా ఊబకాయం, రక్తపోటు, హృద్రోగాలు తప్పట్లేదు. వీటికి తోడు అలసట, నీరసం ఆవహిస్తుంది. ఈ రుగ్మతల నుంచి బయటపడాలంటే..? రోజంతా చురుగ్గా వుండాలంటే.. అల్పాహారంగా చద్దన్నం తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
రాత్రి మిగిలిన అన్నంలో పెరుగో, లేదా వేడి గంజి, ఉప్పు కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. రాత్రి మిగిలిన అన్నంలో ఉదయానికల్లా ఐరన్ చేరుతుంది. అలాగే పోటాషియం, కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఈ చద్దన్నాన్ని రోజు ఇడ్లీ, దోసెలకు బదులు తీసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
వర్షాకాలంలో గంజి లేదా వేడినీళ్లను కలిపి రాత్రి మిగిలిన అన్నాన్ని పొద్దున తింటే.. చర్మ వ్యాధులను తొలగించుకోవచ్చు. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం చద్దన్నం తగ్గిస్తుంది. ఇంకా నీర‌సం త‌గ్గిపోతుంది. బీపీ అదుపులో ఉంచే గుణం చద్దన్నానికి వుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments