Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడినీటిని తలపైన పోసుకుంటే..?

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (12:35 IST)
వేడి వేడి నీటి స్నానం కంటే స్నానానికి చల్లటి నీరే శ్రేష్టమైనది. నిలువ ఉండే చన్నీరు స్నానానికి పనికిరాదన్నారు. అప్పటికప్పుడు భూమి నుంచి పైకి తెచ్చిన నీరే స్నానానికి శ్రేష్టమైనది. ఇప్పటికాలంలో బావులలో నీరు లేదు కాబట్టి బోరింగ్ వాటర్ అప్పటికప్పుడు కొట్టుకుని స్నానం చేస్తే మంచిది. మొదట నీటిని తలపై పోసుకోవాలి. 
 
ఇలా చేయడం ద్వారా లోపలి వేడి చేతులగుండా పాదాలగుండా వెడలిపోతుంది. మొదట నీటిని పాదాలపై పోసుకోరాదు. అట్లు చేయడం వల్ల శరీరంలో వేడిమి పైకి పొంగి తలలో చేరుతుంది. అందువల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొదట తలపైన, అటుపైన పాదాలపైన తర్వాత శరీరంపైన నీటిని పోస్తూ స్నానం చేయాలి.
 
వేడినీటిని తలపైన ఎప్పుడూ పోసుకోరాదు. దానివల్ల ఎంతో కీడు కలుగుతుంది. చాలా వేడిగా ఉన్న నీటిని తలపై పోసుకోవడం ద్వారా కండ్ల జబ్బులు, దృష్టి లోపాలు కలుగుతాయి. తల వెంట్రుకలు రాలిపోతాయి. ఝల్లుమనిపించే చన్నీటితో స్నానం చేయడం వల్ల కఫం ఎక్కువవుతుంది. వాతదోషాలు కలుగుతాయి. మిక్కిలి వేడి నీటి స్నానం చేయడం వల్ల రక్తపిత్తదోషాలు వ్యాపిస్తాయి. కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

సంబంధిత వార్తలు

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments