Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతుల్ని మజ్జిగ లేదా నీటిలో కలిపి తీసుకుంటే? (video)

గర్భంతో వున్న మహిళలు రోజూ మెంతులను నిత్యం ఏదో రూపంలో ఆహారంలో చేర్చుకుంటే.. ప్రసవం సమయంలో కలిగే నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. కానీ మెంతుల్ని రోజుకో స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. మోతాదు మించకుండా

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (10:37 IST)
గర్భంతో వున్న మహిళలు రోజూ మెంతులను నిత్యం ఏదో రూపంలో ఆహారంలో చేర్చుకుంటే.. ప్రసవం సమయంలో కలిగే నొప్పుల్ని తగ్గించుకోవచ్చు. కానీ మెంతుల్ని రోజుకో స్పూన్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. మోతాదు మించకుండా తీసుకోవాల్సి వుంటుంది. 
 
మహిళలకు మెంతులు ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్ని వాడటం ద్వారా స్త్రీలకు రుతుక్రమం సరిగ్గా వుంటుంది. హార్మోన్ల విడుదల సక్రమం అవుతుంది. రుతుక్రమ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెంతులను నెయ్యిలో దోరగా వేయించి మెత్తగా చూర్ణం చేయాలి. దానికి సమానంగా గోధుమ పిండిని కలిపి.. ఆ మిశ్రమంలో పంచదార చేర్చి హల్వాలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది.
 
అలాగే రోజూ పది నుంచి 20 గ్రాముల మెంతుల్ని మజ్జిగ లేదా నీటిలో కలిపి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. తద్వారా గుండె జబ్బులు నయం అవుతాయి. అధిక బరువు తగ్గుతారు. ఇంకా భోజనం చేసేటప్పుడు ఒక టీస్పూన్ మెంతులను తింటే భోజనం తరువాత గ్యాస్, అసిడిటీ రాకుండా ఉంటాయి. మధుమేహాన్ని మెంతులు దూరం చేస్తాయి. 
 
రాత్రి పూట ఒక గ్లాస్ నీటిలో గుప్పెడు మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని పరగడుపునే తాగి అనంతరం మెంతులను తినేయాలి. ఇలా రోజూ చేస్తే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. తేనె, నిమ్మరసం, మెంతుల పొడిని కలిపి తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. గొంతు నొప్పి, మంట తగ్గుతాయి.
 
పెద్ద పేగులో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను తొలగించడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. దీని వల్ల పెద్ద పేగు శుభ్రమవుతుంది. కొలన్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. మెంతులు చర్మాన్ని కూడా సంరక్షిస్తాయి. 
 
మెంతులను పొడి చేసి కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై మచ్చలు ఉన్న ప్రాంతంలో రాస్తే మచ్చలు తొలగిపోతాయి. కేశాలకు, మాడుకు మెంతుల పొడి పేస్టును రాసుకుంటే చుండ్రు, తొలగి వత్తుగా జుట్టు పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments