Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్ఞాపకానికి ‘మాట’ తోడు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:42 IST)
మనిషికి మనిషి తోడు. వెంట ఎవరైనా ఉంటే మంచీ చెడూ మాట్లాడుకోవచ్చు. దీంతో మనసు తేలిక పడుతుంది. అంతేనా?.. మెదడు ఆరోగ్యమూ ఇనుమడిస్తుంది.

ఇటీవల వైద్యపత్రిక జామాలో ప్రచురితమైన అధ్యయనం ఇదే పేర్కొంటోంది. మనం చెప్పేది శ్రద్ధగా వినేవారుంటే విషయ గ్రహణ సామర్థ్యం (ఆలోచన, హేతుబద్ధత, జ్ఞాపకశక్తి) క్షీణించే అవకాశం తక్కువగా ఉంటున్నట్టు తేలింది మరి.

మెదడులో అల్జీమర్స్‌ మాదిరి మార్పులున్నా ‘మాట తోడు’ ప్రభావం కనిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతానికి అల్జీమర్స్‌ను నయం చేసే చికిత్స ఏదీ లేదు.

ఈ నేపథ్యంలో అల్జీమర్స్‌ లక్షణాలను నివారించుకోవటానికి, విషయ గ్రహణ సామర్థ్యం త్వరగా క్షీణించకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశముందని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.
 
మనదేశంలో సుమారు 50 లక్షల మంది అల్జీమర్స్‌తో బాధపడుతున్నారని అంచనా. ఇది జ్ఞాపకశక్తి, భాష, నిర్ణయాలు తీసుకోవటం, స్వతంత్రంగా జీవించటాన్ని గణనీయంగా దెబ్బతీస్తుంది.

అల్జీమర్స్‌ ప్రధానంగా వృద్ధాప్యంలోనే దాడి చేస్తుంది కాబట్టి 65 ఏళ్ల కన్నా చిన్నగా ఉన్నవారు సామాజిక తోడ్పాటుతో గణనీయమైన ప్రయోజనాన్ని పొందే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు.

40ల్లో, 50ల్లో ఉన్నప్పుడు మనం చెప్పేది శ్రద్ధగా వినేవారు ఎక్కువగా ఉన్నవారితో పోలిస్తే తక్కువగా ఉన్నవారిలో విషయ గ్రహణ సామర్థ్యం వయసు నాలుగేళ్లు అధికంగా ఉంటోందని వివరిస్తున్నారు.
 
ఈ నాలుగు సంవత్సరాలు చాలా కీలకం. ఎందుకంటే చాలామంది వయసు మీద పడ్డాకే మెదడు ఆరోగ్యాన్ని పెంచుకోవటం గురించి ఆలోచిస్తుంటారు. నిజానికి మెదడు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడే అలవాట్లను అలవరచుకునే విలువైన సమయం అప్పటికే మించిపోతుంది.

ఇందుకోసం పెద్ద పెద్ద పనులేమీ చేయక్కర్లేదు. మంచి సామాజిక సంబంధాలు కలిగుండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి చిన్న చిన్న మార్పులైనా గణనీయమైన ప్రభావాన్ని చూపించగలవని పరిశోధకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments