Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకి బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (09:59 IST)
కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది చనిపోతున్నారు. ఇప్పటికే కరోనా మరణాలు వేల సంఖ్యలో ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్ర విద్యాశాఖ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్ కన్నుమూశారు. ఆమెకు వయసు 59 యేళ్లు. 
 
కొన్ని రోజుల క్రితం ఈ వైరస్ బారినపడిన ఆమె... గుర్గావ్‌ మేదాంత హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఆమె ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆమె 2004లో ఉదయపూర్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఉదయపూర్ నుంచి సచిన్ పైలట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె రాజసమంద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఆమె విజయం సాధించారు.
 
కరోనా అన్‌లాక్ తర్వాత తన సొంత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఆ సమయంలోనే ఆమెకు కరోనా వైరస్ సోకింది. మూడు వారాల కిందట కరోనా లక్షణాలతో మేదాంత హాస్పిటల్‌లో చేరారు. అప్పటి నుంచి ఆమెకు ఆధునిక వైద్య చికిత్సను అందిస్తూ వచ్చారు. కానీ, ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. ఈ పరిస్థితుల్లో ఆమె ఆరోగ్య పరిస్థితి విషయమించి ఆదివారం రాత్రి కన్నుమూశారు. 
 
రాష్ట్రంలో కరోనా మహమ్మారితో మరణించిన రెండో ఎమ్మెల్యే ఆమె కావడం గమనార్హం. ఇటీవలే సహద కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కైలాష్‌ త్రివేది భిల్వారా మహమ్మారి బారినపడి మృతి చెందారు. కిరణ్‌ మహేశ్‌ మృతికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధరరాజే సంతాపం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments