Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాయిని కుటుంబంలో మరో విషాదం.. సతీమణి కూడా కన్నుమూత

నాయిని కుటుంబంలో మరో విషాదం.. సతీమణి కూడా కన్నుమూత
, మంగళవారం, 27 అక్టోబరు 2020 (08:52 IST)
అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి, తెరాస సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి సతీమణి అహల్య కూడా కన్నుమూసింది. ఆమె వయసు 68 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె... ఇటీవల కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ నుంచి ఆమె ఇటీవలే కోలుకున్నట్టు కనిపించారు. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కూడా కరోనా నెగెటివ్ అని వచ్చింది. 
 
అయితే, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. హైదరాబాదు, జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నాయిని మృతి సమయంలో ఆఖరి చూపు చూసేందుకు కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్సులో తీసుకెళ్లారు. భర్త చనిపోయిన ఐదు రోజుల్లోనే భార్యాభర్తలు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో నాయిని కుటుంబంలో విషాదం నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం.. ఉప్పుటేరు కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్