Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ను చూస్తాం: రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోందని.. చాలామంది ఐపీఎల్ టోర్నీ తరహాలో ఫిఫా ప్రపంచకప్‌ను చూసేందుకు సిద్ధంగా వున్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ తెలిపారు. త్వరలోనే ఫిఫా వరల్డ్‌క

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (16:16 IST)
భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోందని.. చాలామంది ఐపీఎల్ టోర్నీ తరహాలో ఫిఫా ప్రపంచకప్‌ను చూసేందుకు సిద్ధంగా వున్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ తెలిపారు. త్వరలోనే ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత జట్టు పాల్గొంటుందని మంత్రి తెలిపారు. ఫుట్‌బాల్‌లే కాదు ఏ క్రీడలోనైనా పోటీ ఇచ్చే సత్తా భారత్‌కు వుందని పేర్కొన్నారు. 
 
ఫిఫా వరల్డ్‌కప్‌లో భారత్‌ పాల్గొనకపోయినప్పటికీ ఆ టోర్నీలో పాల్గొనే సత్తా మనకుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఆటగాళ్ల శిక్షణ పొందే అవకాశాలు, వారికి లభించే మద్దతు గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుందని చెప్పుకొచ్చారు. పాఠశాలలు కేవలం చదువులపై కాకుండా ఆటల్లో ప్రోత్సాహం కలిగించేలా దృష్టి సారించాలని కోరారు.
 
ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల నిబద్దత పరంగా కొన్నిసార్లు బ్రెజీల్‌, మరి కొన్ని సార్లు అర్జెంటీనా జట్లు ఇష్టమని, కానీ భారత్‌కే తాను అతిపెద్ద అభిమానినని రాథోడ్‌ చెప్పారు. త్వరలోనే ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌ను చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments