Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమ్ ఓటమిని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కామెంటేటర్

క్రికెట్ అంటే ఎంత పిచ్చో... చాలా మందికి ఫుట్‌బాల్ అన్నాకూడా అంతేప్రాణం. తమ దేశ జట్టు ఓడిపోతే ప్రాణాలు విడిచే ఫుట్‌బాల్ అభిమానులు కూడా ఉన్నారు. మొన్నటికి మొన్న అర్జెంటీనా ఓడిపోయిందని కేరళకు చెందిన ఓ అభ

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (16:11 IST)
క్రికెట్ అంటే ఎంత పిచ్చో... చాలా మందికి ఫుట్‌బాల్ అన్నాకూడా అంతేప్రాణం. తమ దేశ జట్టు ఓడిపోతే ప్రాణాలు విడిచే ఫుట్‌బాల్ అభిమానులు కూడా ఉన్నారు. మొన్నటికి మొన్న అర్జెంటీనా ఓడిపోయిందని కేరళకు చెందిన ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే కదా. ఈసారి ఏకంగా ఓ కామెంటేటర్ తమ టీమ్ ఓటమిని తట్టుకోలేక భావోద్వేగానికి గురయ్యాడు. ఆ క్రమంలో గుండెపోటుతో మృతి చెందాడు.
 
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ గ్రూప్ మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఈజిప్ట్ ఓడిపోయింది. అప్పటివరకు మ్యాచ్ చూస్తుండిన అబ్దుల్ రహీమ్ మొహమ్మద్ గుండెపోటుతో చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మ్యాచ్ 1-1తో డ్రాగా ముగుస్తుందనుకున్న సమయంలో చివరి క్షణాల్లో సౌదీ గోల్ చేసి 2-1తో విజయం సాధించింది. దీన్ని జీర్ణించుకోలేని రహీమ్ అక్కడ కుప్పకూలి చనిపోయాడు. 
 
మ్యాచ్ తర్వాత అబ్దుల్ నైల్ స్పోర్ట్స్ చానెల్‌కు విశ్లేషణ అందించాల్సి ఉంది. అయితే అక్కడ ఉన్న సమమంలోనే చాతీ నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతన్ని బతికించడానికి తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. మృతికి కార్డియాక్ అరెస్ట్ కారణమని డాక్టర్లు తేల్చారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments