సోదరునికి సోదరి రాఖీ ఎప్పుడు కట్టాలంటే..?

సోదరునికి సోదరి రాఖీ ఎప్పుడు కట్టాలంటే..? శ్రావణ పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటుస్నానం చేసి, రక్షను పూజించాలి. ఆ తరువాత అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి. శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (15:43 IST)
సోదరునికి సోదరి రాఖీ ఎప్పుడు కట్టాలంటే..? శ్రావణ పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటుస్నానం చేసి, రక్షను పూజించాలి. ఆ తరువాత అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి. శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్న సమయంలో రాఖీ కట్టాలని పండితులు చెప్తున్నారు. ఆ తర్వాత నోరు తిపి చేయడం సంప్రదాయం.
 
మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు, మధ్యాహ్న వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని, ఆ సమయంలోనే రాఖీని కట్టించుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక పెళ్లి అయిన ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలను కట్టడం సంప్రదాయం. 
 
పూర్వకాలంలో భర్తకి భార్య రక్షణ కోసం రాఖీని కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కడుతుంది. పురాణ కాలంలో రాజులు యుద్ధాలకువెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షను కట్టుకొని ఆ తర్వాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు. రాఖీ పౌర్ణమీ రోజు కట్టే రక్షలో ఆసామాన్యమైన విష్ణుశక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విరుదునగర్ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు : 17 మంది మృతి

ప్రధాని మోడీ రాజకీయ ప్రసంగంలో 59 సార్లు కాంగ్రెస్ పేరును ప్రస్తావించారు : ఖర్గే

కుక్కల బారినపడిన మచ్చల జింక - కాపాడి చంపి వండుకుని ఆరగించిన గ్రామస్థులు

ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టినరోజు - రూ.76 లక్షలు విరాళం ఇచ్చిన భువనేశ్వరి

కళ్యాణ్ బాబు ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదు : చిరంజీవి

అన్నీ చూడండి

లేటెస్ట్

18-04-2026 శనివారం ఫలితాలు - కొన్ని సమస్యల నుంచి బయటపడతారు

Tirumala: పాలకడలిని పోలిన పొగమంచు.. తిరుమలలో అరుదైన దృశ్యం

త్వమేవ మాతా చ పితా త్వమేవ...

17-04-2026 శుక్రవారం ఫలితాలు (అమావాస్య) - పొగిడే వారితో జాగ్రత్త

అహోబిలం నరసింహ స్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు

తర్వాతి కథనం
Show comments