Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ పింఛ‌న్ల పంపిణీకి రూ.1,547.17 కోట్లు విడుదల

Webdunia
సోమవారం, 2 మే 2022 (17:54 IST)
YSR Pension Kaanuka
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద 60,87,942 మందికి పింఛ‌న్ల పంపిణీకి రూ.1,547.17 కోట్లను ఏపీ సర్కారు విడుదల చేసింది. ఏపీ వ్యాప్తంగా లబ్ధిదారులకు వైఎస్సార్ పింఛన్లను లక్షలాది మంది వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పింఛన్ల పంపిణీ రెండో రోజు కూడా కొనసాగింది. సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల వరకు 77.01 శాతం పింఛన్లు పంపిణీ చేశారు. 47 లక్షల మంది లబ్ధిదారులకు మొత్తం రూ .1193.88  కోట్లు పంపిణీ చేయడం జరిగింది.
 
వైఎస్సార్ పింఛన్ల పంపిణీ కార్యక్రమం మే 1న ప్రారంభమై మే 5 వరకు కొనసాగుతుంది. పెన్షనర్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్, ఐరిస్ ఆథెంటికేషన్, రియల్ టైమ్ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా పెన్షనర్ల ఇంటి వద్దనే వాలంటీర్లు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేస్తున్నారు.
 
రాష్ట్రంలోని అన్ని గ్రామ/ వార్డు సచివాలయాలకు ఇప్పటికే రూ.1,547.17 కోట్లు బదిలీ అయ్యాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బుడ్డి ముత్యాలనాయుడు తెలిపారు. సెలవు దినం అయినప్పటికీ ఆదివారం కూడా 60 లక్షల 80 వేల మందికి పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments