వల్లభనేని వంశీ ఎటు పోతున్నారు? ఈ నాలుగేళ్లు అజ్ఞాతవాసిగానా?

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (17:39 IST)
టిడిపి సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. వంశీ నెక్ట్స్ ప్లానేంటి.. కొంతమంది వైసిపిలో చేరుతారంటే మరికొందరు అస్సలు రాజకీయాల్లోనే ఉండరన్న ప్రచారం జరుగుతోంది. అసలు వల్లభనేని వంశీ పక్కా ప్లాన్‌తోనే ప్రస్తుతం ఉన్నారని.. ఆయన త్వరలోనే రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారిన విషయం తెలిసిందే. టిడిపిలో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాస్త పార్టీని వదిలేయడం ఆ పార్టీలో చర్చకు దారితీసింది. వంశీ పార్టీకి రాజీనామా చేయకముందు మొదటగా బిజెపి నేత సుజనా చౌదరిని కలిశారు. ఆ తరువాత రెండుమూడు గంటల వ్యవధిలో ఎపి సిఎంను కలిశారు. ఇక ఏముంది ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం బాగానే జరిగింది. 
 
అయితే అనూహ్యంగా వంశీ పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసేశారు. అయితే వంశీ ఒక పక్కా స్కెచ్‌తోనే ఉన్నారంటున్నారు విశ్లేషకులు. వైసిపి నేతల నుంచి హెచ్చరికలు ఎక్కువయ్యాయని అందుకే తాను రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నానని చెప్పాడు వంశీ. ఆ తరువాత మీడియాకు కానీ, అనుచరులకు కానీ కనిపించకుండాపోయారు. 
 
అయితే ప్రస్తుతం నాలుగు సంవత్సరాలపాటు సైలెంట్‌గా ఉండి ఆ తరువాత వైసీపి నుంచి పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా వెళ్ళాలన్నది వంశీ ఆలోచన అంటున్నారు ఆయన అనుచరులు. ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపిగానే వంశీ పోటీ చేస్తారని.. ఇక ఎమ్మెల్యేగా వెంకట్రావు ఉంటారని చెబుతున్నారు. 
 
పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా ఉండేది వంశీ, వెంకట్రావుల పరిస్థితి. అందుకే వైసిపి పార్టీలోకి వంశీ రావడాన్ని ఏమాత్రం ఒప్పుకోలేదు వెంకట్రావు... ఆయన అనుచరులు. ఇలాంటి పరిస్థితుల్లో వెంకట్రావును శాంతింపజేయడమే కాకుండా రాజకీయాలకే దూరంగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది వంశీ ఆలోచన. అందుకే ఆయన పక్కా ప్రణాళికతోనే ఇదంతా చేస్తారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అప్పట్లో ఎకరం 9 లక్షలకు అమ్మా, ఇప్పుడక్కడ ఎకరం 100 కోట్లు, ఏం చేస్తాం?: నటుడు శివాజీ

Chiranjeevi: పెద్ది చిత్రం రైరై రారా పాట లో చరణ్ కష్టానికి ఫలితం దక్కింది : మెగాస్టార్ చిరంజీవి

Laya: మా అమ్మాయి ఓటీటీలో సినిమా అనగానే ఎంతో బాధపడింది : లయ

Pooja : దోశ డైరీస్ పై మంచి కథలన్నీ నిర్మించాలని ఉంది.: పూజా శరత్ కుమార్

Manoj: డేవిడ్ రెడ్డి షూటింగ్‌తో మనోజ్ బిజీ - సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న మౌనిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments