Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కంచుకోట గోరఖ్‌పూర్ బద్ధలైంది.. కమలనాథులు నివ్వెరపోయారు

భారతీయ జనతా పార్టీ కంచుకోట గోరఖ్‌పూర్ బద్ధలైంది. దీంతో కమలనాథులు నివ్వెరపోయారు. గత మూడు దశాబ్దాలుగా కమలనాథుల చేతుల్లో ఉన్న ఈ లోక్‌సభ స్థానం ఇపుడు సమాజ్‌వాదీ పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయింది.

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (12:00 IST)
భారతీయ జనతా పార్టీ కంచుకోట గోరఖ్‌పూర్ బద్ధలైంది. దీంతో కమలనాథులు నివ్వెరపోయారు. గత మూడు దశాబ్దాలుగా కమలనాథుల చేతుల్లో ఉన్న ఈ లోక్‌సభ స్థానం ఇపుడు సమాజ్‌వాదీ పార్టీ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీన్ని కమలనాథులు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఫలితంగా ఈ ఓటమికి గల కారణాలను విశ్లేషించే పనిలోపడ్డారు. 
 
ఈ స్థానం చరిత్రను ఓసారి పరిశీలిస్తే, గోరఖ్‌పూర్‌ లోక్‌స స్థానం. గోరఖ్‌నాథ్‌ మఠాధిపతి మహంత అవైద్యనాథ్‌ వరుసగా మూడుసార్లు ఇక్కడ గెలిచారు. ఆయన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఈయన వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. అంటే, దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ బీజేపీదే ఆధిపత్యం. గత ఎన్నికల్లోనూ అంతకుముందు ఎన్నికల్లో కూడా యోగి ఏకంగా 3 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆయన యూపీ సీఎంగా ఎన్నికయ్యారు. దీంతో యోగి రాజీనామా చేయడంతోనే అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. 
 
గత ఎన్నికల్లో అయితే, యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఏకంగా 73 గెలుచుకుంది. దాంతో, గోరఖ్‌పూర్‌ పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై బండి నడకే అనుకున్నారంతా! యోగి ఆదిత్యనాథ్‌ కంచుకోటలో ఇతర పార్టీలు అడుగు పెట్టడం అసాధ్యమని భావించారు. కానీ, ఆ కంచుకోట బద్దలైంది. గోరఖ్‌పూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌ కుమార్‌ నిషాద్‌ సంచలన విజయం సాధించారు. 
 
బీజేపీ దాదాపు 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో, బీజేపీ అగ్ర నేతలు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, రాజకీయ పండితులు కూడా నివ్వెరపోయారు. గోరఖ్‌పూర్‌ పార్లమెంటు స్థానం బీజేపీ కంటే కూడా గోరఖ్‌నాథ్‌ మఠానికి చెందినది. మూడు దశాబ్దాలుగా మఠానికి చెందిన వ్యక్తులే ఇక్కడ విజయం సాధిస్తున్నారు. ఇపుడు ఆ స్థానం ఓటర్లు చరిత్రను తిరగరాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments