Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మనీయమ్మ.. సర్వే చేస్తే.. షాక్ కొట్టిందేంటి..? వైకాపా గెలుపు ఖాయమా?

Webdunia
గురువారం, 9 మే 2019 (13:24 IST)
ఏపీ ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయోనని ఆరాటం కొద్దీ నందిగామకు చెందిన ఓ టీడీపీ నేత సొంతంగా సర్వే చేయించుకున్నారని టాక్ వస్తోంది. 2019 ఎన్నకలే కాదండోయ్.. 2014లో కూడా ఇదే జరిగిందట. ఆ ఎన్నికల ఫలితాలపై జరిపిన సర్వేలో రిపోర్ట్ టీడీపీకి అనుకూలంగా వచ్చింది. 
 
ఇక తాజాగా చేయించిన సర్వేతో మాత్రం టీడీపీ నేతకు షాక్ కొట్టింది. ఈ సర్వేలో టీడీపీకి 58 సీట్లు సాధిస్తుందని రిపోర్ట్ వచ్చింది. అంతే సదరు నేత కంగారు పడ్డారని తెలిసింది. ఇందుకు కారణం అదే సర్వేలో వైసీపీకి మాగ్జిమం 105 స్థానాలు వస్తాయని తేలడమే. 
 
ఈ సర్వే రిపోర్ట్‌తో రానున్న ఫలితాలు వైకాపాకు అనుకూలంగా వుంటాయని టీడీపీ టెన్షన్ పడుతుందట. అంతటితో ఆగలేదు. ఇన్నాళ్లూ... తమకు సీట్లు తగ్గినా... జనసేన ద్వారా పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావచ్చనే అంచనాల్లో ఉన్న ఆ నేత... తన సర్వే రిపోర్టులో జనసేనకు 3 సీట్లు మాత్రమే వస్తాయని తేలడంతో మరింత ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.
 
ఏపీలో మొత్తం 175 స్థానాలు ఉండగా, మ్యాజిక్ మార్కు 88. కాబట్టి ఆయనెవరో టీడీపీ నేత సర్వే ప్రకారం చూస్తే.. వైకాపాకే సానుకూల పవనాలు వీస్తున్నాయని తేలిపోయిందట. అదన్నమాట సంగతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments