Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమాల పుట్ట తవ్వుతున్న కూటమి ప్రభుత్వం: వైసిపి నుంచి భాజపాకి వలసలు?

ఐవీఆర్
బుధవారం, 24 జులై 2024 (20:48 IST)
గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలు భారీగా వున్నాయనీ, ఏ శాఖను కదిలించినా కోట్లకు కోట్లు నిధులు దారి మళ్లించి బొక్కేశారని ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయం రూ. 14,276 కోట్ల రూపాయలను ఏపీ స్టేట్ డెవల్మెంట్ కార్పోరేషనుకు మళ్లించేసారని విచారణలో గుర్తించినట్లు చెప్పారు.
 
ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కాకినాడలో భారీఎత్తున అక్రమ బియ్యం నిల్వలు సీజ్ చేసారు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కనుసన్నల్లో ఈ అక్రమాలు జరిగినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేసారు. అలాగే దేవాదాయ శాఖ, రెవిన్యూ శాఖ ఇలా అన్ని శాఖల్లోనూ భారీ అవినీతి జరిగిందనీ, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మదనపల్లి వంటి కార్యాలయాలకు నిప్పు కూడా పెడుతున్నారంటూ చెప్పారు.
 
మొత్తమ్మీద అక్రమాలు, అవినీతి క్రమంగా ప్రజల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తుండటంతో వైసిపికి చెందిన కొంతమంది నాయకులు ఇటు తెదేపా అటు జనసేనలోకి కాకుండా జాతీయ పార్టీ భాజపాలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారట. అందుకోసం ఇప్పటికే బీజేపి ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డిలతో కొంతమంది టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. భాజపా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే... ఇక జంపింగే తరువాయి అని కాచుకుని కూర్చున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

తర్వాతి కథనం
Show comments