Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెస్‌నోట్ల పార్టీ జనసేన, అన్నదెవరు?

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (22:16 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి తరువాత బిజెపి-జనసేనలే ఉన్నాయి. బిజెపి-జనసేనలు కలిసి రెండు సంవత్సరాలవుతోంది. ఇద్దరూ వేరువేరు అజెండాలతో ఉన్నా సరే కలిసికట్టుగా సాగాలని నిర్ణయించుకున్నారు. కానీ ప్రభుత్వ విధానాలపై రెండు పార్టీలు కలిసి పోరాటం చేయలేకపోయాయి.
 
ముందుగా తాము బలంగా ఉన్నామని చెప్పుకునే బిజెపి.. అలాగే బలంగా ఉన్నా మా సహకారం ఎంతో అవసరమంటున్న జనసేన. ఇలా ఎవరికి వారు ఒకరిపై ఒకరు మాట్లాడుతూ ఉండడంతో చివరకు కలిసి పోరాటం చేయలేకపోతున్నాయి. 
 
కానీ బిజెపి మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వేగంగానే ప్రజా సమస్యలపై స్పందిస్తూ పోరాటాలకు దిగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా హిందూత్వంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న పోరాటం ప్రజల్లో మంచి ఫలితాన్నే వచ్చే విధంగా చేస్తోంది. 
 
తాజాగా కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెట్టకూడదంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు బిజెపి నాయకులు. అధికార వైసిపి ఎమ్మెల్యే టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని పెడతామని చెప్పడం.. హిందువులను ఊచకోత కోసిన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఎలా పెడతారంటూ ప్రశ్నించింది బిజెపి.
 
బిజెపి ఒకటే ముందుకు సాగి పోరాటం చేసింది. దీంతో కలెక్టర్ టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు అనుమతినివ్వలేదు. ఈ పోరాటంలో జనసేన అస్సలు పాల్గొనలేదు. దీంతో బిజెపి నేతలు జనసేనతో కలవాల్సిన పని లేదన్న నిర్ణయానికి వచ్చేశారట. 
 
ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా కేంద్ర నాయకత్వం దృష్టికి జనసేన వ్యవహారాన్ని తీసుకెళ్ళాలని చూస్తున్నారట. ఎక్కడా ప్రభుత్వంపై పోరాటం చేయకుండా ప్రెస్ నోట్లకే జనసేన పరిమితమైపోతోందని సోము వీర్రాజు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్ళబోతున్నారట. అస్సలు పూర్తిగా వారిని దూరం పెడితే మంచిదన్న అభిప్రాయాన్ని కూడా సోము వీర్రాజు చెప్పబోతున్నారట. మరి చూడాలి బిజెపి.. జనసేనల మధ్య స్నేహబంధం కొనసాగుతుందా.. లేకుంటే మధ్యలోనే ఆగిపోతుందా..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments